హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్డేడియంలో నిర్వహిస్తున్న బుక్ ఫెయిర్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకర్షిస్తుంది ప్రముఖులుసైతం బుక్ ఫెయిర్కు హాజరవుతున్నారు. తాజాగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల ఆలోచన, మేధస్సు పెరుగుతుందన్నారు. పిల్లలు తమ సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలను చదవాలన్నారు. ఈ సందర్భంగా పబ్లికేషన్ డివిజన్ అధికారులను…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,037 శాంపిల్స్ పరీక్షించగా… 162 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇదే సమయంలో 210 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,80,413 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,72,847…
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 1 నుంచి 31 వరకు ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మచిలీపట్నం-కర్నూలు, నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ, మచిలీపట్నం-సికింద్రాబాద్, తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వివరించారు. ప్రత్యేక రైళ్ల వివరాలు:
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై వివాదం నేపథ్యంలో ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులను మంత్రి సబిత ఇంద్రారెడ్డి సున్నితంగా హెచ్చరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో క్లాసులు సరిగ్గా జరగని కారణంగా విద్యార్థులు ఫెయిలయ్యాయని ఆందోళన చెందుతున్నారని.. వచ్చే ఏడాదిలో సెకండియర్ పరీక్షలు ఉన్నందున ఒత్తిడికి గురికావొద్దనే అందరినీ పాస్ చేసినట్లు సబిత వివరణ ఇచ్చారు. Read Also: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు అందరూ పాస్ అయితే పరీక్షలు…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియ చేశారు. మానవత్వాన్నిచాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనగమనం, నేటికీ అందరికీ ఆచరణీయమని అని సిఎం అన్నారు. క్రిస్మస్ సందర్భంగా అటు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా…
ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలపై గత వారం రోజుల నుంచి తీవ్ర గందర గోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 35 మార్కులతో ఫెయిలైన విద్యార్థులందరినీ… పాస్ చేస్తున్నట్లు తెలిపారు. మినిమమ్ మార్కులు వేసి.. ఈ సారి పాస్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు సబితా ఇంద్రారెడ్డి. ఇకనైనా విద్యార్థులు వచ్చే పరీక్షలపై దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికైనా…
తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తుందని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో కేంద్రంస్పష్టత ఇవ్వాలన్నారు. రైతులతో రాజకీయం చేస్తున్నారు. “ఆహార భద్రత చట్టం” కింద దేశంలో ధాన్యం సేకరించడం కేంద్రం భాద్యత అని అన్నారు. భారత్ లో తెలంగాణ లేదా..? తెలంగాణ రైతులు భారత దేశ రైతులు…
తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధర పెంపునకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుల తో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం… ఏసీ థియేటర్లలో కనిష్ట టికెట్ ధర 50 రూపాయలు కానుండగా… గరిష్ట టికెట్ ధర 150 రూపాయలకు చేరనుంది. అలాగే మల్టీప్లెక్స్ లలో కనిష్ట టికెట్ ధర వంద రూపాయలు కానుండగా… గరిష్ట టికెట్ ధర 250 రూపాయలకు చేరనుంది. మల్టీప్లెక్స్ రిక్లయినర్…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా… సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో,ధర్నాలతో డ్రామాలు చేస్తుంటే,మాకు ఏ దిక్కూ లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండక,పెట్టుబడి రాక,అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగి రోజుకు ఇద్దరు,ముగ్గురు రైతులు చనిపోతున్నా కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా లేదు దొరగారికి అంటూ చురకలు అంటించారు. ఢిల్లీలో…