Bandi Sanjay: టీఆర్ఎస్ ప్లాన్ ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అకారణంగా రేవంత్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారని ఆయన గుర్తుచేశారు. మంత్రి హరీష్రావు కేంద్రాన్ని తిడుతుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాక్షస ఆనందం పొందారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో 270 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఆ తరువాత ఎన్నికల్లో తుడుచుకుపోయిందన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కుదరదన్నారు. అసలు బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటి అని, సభకు ఎలాంటి ఆటంకం కలిగించకపోయినా, ఏ కారణం లేకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకుని బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. గవర్నర్ను శాసనసభకు ఆహ్వానించకుండా అవమానించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది అన్నారు. అసలు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
హరీష్రావు బడ్జెట్ నేతి బీరకాయలో నెయ్యిలాగా ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఇది అబద్దాల బడ్జెట్ అని.. గత బడ్జెట్లో కేటాయించింది ఎంత ఖర్చు చేశారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు ఎన్ని రోజులు అడ్డుకున్నారో చెప్పాలని.. అక్కడ టీఆర్ఎస్ ఎంపీలు పోడియం దగ్గర ఆందోళన చేశారని బండి సంజయ్ గుర్తుచేశారు. టీఆర్ఎస్ సభ్యులు కూడా లోక్ సభలో ఆందోళన చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్కే అసెంబ్లీలో కూర్చునే అధికారం లేదన్నారు. గవర్నర్ను కలుస్తున్నాం అని.. రాష్ట్రపతిని కూడా కలుస్తామని.. ఆయన అపాయింట్మెంట్ అడుగుతున్నామని బండి సంజయ్ తెలిపారు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
ప్రజా సమస్యలపై తాము న్యాయపరంగా కొట్లాడతామని.. ప్రజల మధ్య నిరసనలు తెలుపుతామని బండి సంజయ్ వెల్లడించారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని.. తెలంగాణలో నియంత పాలన కొనసాగనివ్వమని స్పష్టం చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని.. ఈ పోయే ప్రభుత్వానికి అబద్దాలు ఎక్కువ అని బండి సంజయ్ విమర్శలు చేశారు. బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ను తక్షణమే ఎత్తేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!