ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్పై దొంగతనం కేసు నమోదైంది. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ గాడిదను దొంగతనం చేసినట్టు అందిన ఫిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. రంగనాయకుల గుట్ట దగ్గరున్న సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుని వస్తుండగా జమ్మికుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే గాడిదను దొంగతనం చేశాడన్న ఆరోపణలపై వెంకట్ బల్మూరిని గత రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారని…
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పార్టీని వీడుతున్నారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది… ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్పై ప్రసంశలు కురిపించిన ఆయన.. ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు.. ఇదే సమయంలో.. మంత్రి హరీష్రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై కూడా బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో.. Read Also: Dharmana: కేసీఆర్ వ్యాఖ్యలతో…
వ్యవసాయ మోటర్లకు మీటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలో, ఇప్పటికే విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారంటూ కూడా ఆయన తెలిపారు.. ఇక, ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళంలో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు మనకు అనవసరం అన్నారు.. వ్యవసాయ బోర్లకు మీటర్లు వలన రైతులకు ఒక్క రూపాయి నష్టం ఉండదన్న…
తెలంగాణ ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపిస్తోంది రిజిస్ట్రేషన్ల శాఖ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని రాబట్టింది… గతంలో ఎప్పుడూ రూ.10వేల కోట్ల మార్క్ చేరుకోలేదు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరంలో 10 వేల కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకున్నా.. కేవలం రూ.5,243 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ రూ.12,500 కోట్లు పెట్టుకుంటే.. ఇప్పటికే రూ.10 వేల కోట్ల మార్క్ను దాటేసింది.. Read…
తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి నాయకులు.. ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై సీపీకు ఫిర్యాదు చేశారు.. ఇక, నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా అధికారులు కూడా ధృవీకరించారు.. నకిలీ సర్టిఫికెట్ విషయాన్ని సీపీకి వివరించారు విద్యార్థి నేతలు… కన్సల్టేషన్, ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూట్స్ అడ్డగా ఈ దందా సాగుతుందని సీపీ దృష్టికి తీసుకెళ్లారు..…
సింగరేణి కంపెనీలో పనిచేసే ఆఫీసర్లు, కార్మికులకు గుడ్న్యూస్ చెప్పింది యాజమాన్యం.. రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు నిర్ణయం తీసుకుంది.. దీని కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ఒప్పందం చేసుకుంది… ఎస్బీఐలో ఖాతా ఉన్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఇకపై రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది… ఈ మేరకు సింగరేణి – ఎస్బీఐ మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది… ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ మొత్తం రూ.20…
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతుందని.. మూడేళ్ల కాలంలో మూడు పైసలు కూడా తేలేదన్నారు. బీజేపీ అంటే బక్వాస్ పార్టీ అని.. ఆ పార్టీ నేతలకు లొల్లి ఎక్కువ.. పని తక్కువ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటివరకు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాస్త దూరంగానే ఉంటున్నారు.. కొన్ని సందర్భాల్లో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నా.. వారి మధ్య మనస్పర్దలు కొనసాగుతూనే ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నమాటలు.. అయితే, తాజాగా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్రెడ్డి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక, రేవంత్, కోమటిరెడ్డి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. ఇద్దరూ రెడ్లు…
మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ పెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గాడిద పార్టీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం మాట్లాడతారో, ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియాలని రసమయి అన్నారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడతారని.. అది ఇక్కడున్న వాళ్లకు అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు తెలంగాణలో సిరిసిల్ల ప్రాంతానికి వచ్చి వెళ్తామో లేదో తెలియని ప్రాంతంగా ఉండేదని.. ఎన్నో ఏళ్లు…
ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షా స్పందించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… పార్లమెంట్ సాక్షిగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుంటే భావితరాలు క్షమించమని హెచ్చరించారు.. ఇక, ఏపీకి జరిగిన అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడాలని సూచించిన ఉండవల్లి.. బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలన్నారు.. ఎనిమిదేళ్ల క్రితం లోక్సభలో ఏపీ విభజన బిల్లు ఆమోదం జరిగినట్టు ప్రకటించారని తెలిపారన్న ఆయన.. రాష్ట్ర విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై…