US: జోసెఫ్ కెంట్ రాజీనామాపై వైట్హౌస్ కీలక ప్రకటన.. వార్ మేటర్ లీక్పై సంచలన నిర్ణయం
- మంటరేపుతోన్న జోసెఫ్ కెంట్ రాజీనామా
- జోసెఫ్ కెంట్ రాజీనామాపై స్పందించిన వైట్హౌస్
- అంతర్గత దర్యాప్తు జరుగుతోందని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక అధిపతి జోసెఫ్ కెంట్ రాజీనామా ట్రంప్ ప్రభుత్వంలో తీవ్ర అలజడి సృష్టించింది. ఇరాన్తో అమెరికా యుద్ధం చేయడం ఏ మాత్రం ఇష్టం లేదంటూ జోసెఫ్ కెంట్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతర్జాతీయంగా పెను సృష్టించింది.

Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
తాజాగా జోసెఫ్ కెంట్ రాజీనామాపై వైట్హౌస్ స్పందించింది. ఇరాన్ ఆపరేషన్తో కెంట్కు ఎలాంటి సంబంధం లేదని.. ఎనిమిది నెలల కన్నా తక్కువ కాలం పాటు ఉగ్రవాద నిరోధక సంస్థకు నాయకత్వం వహించారని తెలిపింది. ఇక ప్రభుత్వంలో సమాచారం లీక్ చేసిన వారిని కనుకొనేందుకు అంతర్గత విచారణ జరుగుతోందని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఫాక్స్ న్యూస్కు తెలిపారు.
అంతర్గత విభేదాలపై ప్రశ్నలు పెరుగుతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్పై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా నాయకత్వంలో ఐక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. అంతర్గత వివరాలను ఎవరు లీక్ చేసి ఉండవచ్చో గుర్తించడంపై ఇప్పుడు దృష్టి సారించామని లీవిట్ సూచించారు.
జోసెఫ్ కెంట్..
అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక అధిపతి జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో సంచలన విషయాలు వెల్లడించారు. తన మనస్సాక్షికి విరుద్ధంగా ఇరాన్తో యుద్ధానికి మద్దతు ఇవ్వలేనని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ట్రంప్ ఇరాన్పై యుద్ధం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు ఉండబోదని పేర్కొన్నారు.
పశ్చిమాసియా యుద్ధాలు అమెరికా ప్రాణాలను హరించి, దేశ సంపదను హరించివేస్తాయనే విషయం ట్రంప్కు 2025 జూన్ వరకు తెలుసని తన లేఖలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు, అమెరికా మీడియాలోని ప్రభావవంతమైన సభ్యులు. ఒక తప్పుడు సమాచారం ద్వారా ఇరాన్తో యుద్ధాన్ని ప్రోత్సహించారని తెలిపారు. ట్రంప్పై ‘‘ఎకో ఛాంబర్’’ను ఉపయోగించారని కెంట్ ఆరోపించారు. ఇరాన్తో యుద్ధం ముగించుకుంటే మంచిదని.. లేదంటే దేశాన్ని మరింత గందరగోళంలోకి నెట్టగలరని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!