US: జోసెఫ్ కెంట్ రాజీనామాపై వైట్హౌస్ కీలక ప్రకటన.. వార్ మేటర్ లీక్పై సంచలన నిర్ణయం
- మంటరేపుతోన్న జోసెఫ్ కెంట్ రాజీనామా
- జోసెఫ్ కెంట్ రాజీనామాపై స్పందించిన వైట్హౌస్
- అంతర్గత దర్యాప్తు జరుగుతోందని ప్రకటన
అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక అధిపతి జోసెఫ్ కెంట్ రాజీనామా ట్రంప్ ప్రభుత్వంలో తీవ్ర అలజడి సృష్టించింది. ఇరాన్తో అమెరికా యుద్ధం చేయడం ఏ మాత్రం ఇష్టం లేదంటూ జోసెఫ్ కెంట్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతర్జాతీయంగా పెను సృష్టించింది.

Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
తాజాగా జోసెఫ్ కెంట్ రాజీనామాపై వైట్హౌస్ స్పందించింది. ఇరాన్ ఆపరేషన్తో కెంట్కు ఎలాంటి సంబంధం లేదని.. ఎనిమిది నెలల కన్నా తక్కువ కాలం పాటు ఉగ్రవాద నిరోధక సంస్థకు నాయకత్వం వహించారని తెలిపింది. ఇక ప్రభుత్వంలో సమాచారం లీక్ చేసిన వారిని కనుకొనేందుకు అంతర్గత విచారణ జరుగుతోందని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఫాక్స్ న్యూస్కు తెలిపారు.
అంతర్గత విభేదాలపై ప్రశ్నలు పెరుగుతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్పై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా నాయకత్వంలో ఐక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. అంతర్గత వివరాలను ఎవరు లీక్ చేసి ఉండవచ్చో గుర్తించడంపై ఇప్పుడు దృష్టి సారించామని లీవిట్ సూచించారు.
జోసెఫ్ కెంట్..
అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక అధిపతి జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో సంచలన విషయాలు వెల్లడించారు. తన మనస్సాక్షికి విరుద్ధంగా ఇరాన్తో యుద్ధానికి మద్దతు ఇవ్వలేనని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ట్రంప్ ఇరాన్పై యుద్ధం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు ఉండబోదని పేర్కొన్నారు.
పశ్చిమాసియా యుద్ధాలు అమెరికా ప్రాణాలను హరించి, దేశ సంపదను హరించివేస్తాయనే విషయం ట్రంప్కు 2025 జూన్ వరకు తెలుసని తన లేఖలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు, అమెరికా మీడియాలోని ప్రభావవంతమైన సభ్యులు. ఒక తప్పుడు సమాచారం ద్వారా ఇరాన్తో యుద్ధాన్ని ప్రోత్సహించారని తెలిపారు. ట్రంప్పై ‘‘ఎకో ఛాంబర్’’ను ఉపయోగించారని కెంట్ ఆరోపించారు. ఇరాన్తో యుద్ధం ముగించుకుంటే మంచిదని.. లేదంటే దేశాన్ని మరింత గందరగోళంలోకి నెట్టగలరని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!