డామిట్ కథ అడ్డం తిరిగింది. ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చేందుకు భార్య పన్నిన కుట్ర బెడిసి కొట్టింది. దీంతో పోలీసులు ఆమెతోపాటు ప్రియున్ని అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన వరంగల్లో వెలుగులోకి వచ్చింది. వరంగల్లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు అనేవ్యక్తిపై ఆగస్టు 14న రాత్రి హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని పోతననగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అత్యంత కిరాతకంగా చిత్ర హింసలు పెట్టి దాడి చేశారు. అతను చనిపోయాడనుకొని అక్కడే…
Vehicle Life Tax : తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై లైఫ్టాక్స్ పెంచింది. ఆగస్టు 14 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రవాణా, రోడ్లు-భవనాల శాఖ జారీ చేసిన జీఓ నెం.53 ద్వారా మోటార్ వాహనాల పన్ను చట్టం, 1963లోని షెడ్యూల్స్లో మార్పులు చేసింది. ఈ మేరకు రెండు, మూడు, నాలుగు చక్రాల నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలకు పెరిగిన లైఫ్టాక్స్ వసూలు చేయనుంది. తాజా నిర్ణయం ప్రకారం, రూ.50 వేలు లోపు ధర కలిగిన రెండు చక్రాల వాహనాలపై…
తెలంగాణలో కుల గణనను పగడ్బంధీగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న విగ్రహ స్థాపన శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుల గణనను పూర్తి చేశామని, వందకు వంద శాతం సరిగ్గా లెక్కలు నమోదయ్యాయని తెలిపారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం….బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసం… మా రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తై., నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాల అంశం తేల్చుకోవాలి. వరద జలాలపై ఇరు రాష్ర్టాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయ బద్ధంగా ఉంటుంది. నీటి వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది… రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం… ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్,…
సాగునీటిపై హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరో కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతికారాలు తీర్చుకుంటుంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన వరదను సముద్రంలోకి వదులుతుంది.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తుంది.. నంది మేడారం పంప్ హౌస్ నుంచి మానేరుకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్న చేయట్లేదు..…