హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ మామూలుగా ఉన్నప్పటికీ, సాయంత్రం వచ్చిన వర్షం నగర జీవనాన్ని దెబ్బతీసింది.
మెదక్ జిల్లా కేంద్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
Bhadrachalam: గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల వద్ద నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసి జిల్లా కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ప్రాణరక్షణలో ఎలాంటి లోటు…
Godavari Floods: తెలంగాణ రాష్ట్రంలో ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్ వద్ద వరద నీరు జ్ఞాన దీపాలను ముంచేయగా, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ తీరంలో ఉన్న చిన్న వ్యాపారస్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్లో…
Telangana Weather Alert: రాబోయే 24గంటల పాటు తెలంగాణకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా పేర్కొంది. ఇందులో భాగంగా నాలుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది…
Heavy Rains : ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వాయర్ నిండాయి. రిజర్వాయర్ల నుంచి అలుగులు పోస్తున్నాయి. మహబూబాబాద్, సూర్యపేట జిల్లాలో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజక వర్గంలో చెరువులన్నీ నిండి అలుగులు పోస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్ల పైకి నీళ్లు చేరుకున్నాయి. అదేవిధంగా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంది. పాలేరు జలాశయం 23 అడుగులు ఉండగా నిండటంతో గేట్ల నుంచి అలుగులు పోస్తున్నాయి. అదే…
Hyderabad Rains : హైదరాబాద్లో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్పురా ప్రాంతాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు ప్రజలకు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. UP: నది ఒడ్డున ప్రేమికుడు, కొండపై ప్రియురాలి మృతదేహాలు..…
Hyderabad Rains : సోమవారం సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షాలు కురిశాయి, దీనితో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది, నీరు నిలిచిపోయింది. తక్కువ వ్యవధిలో 50 మి.మీ వర్షపాతంతో ప్రమాదకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు టి బాలాజీ హెచ్చరిక జారీ చేశారు. పౌరులు ఇంటి లోపలే ఉండాలని కోరారు. Hitech City Railway Station: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇలా మారిపోతుందని ఊహించారా..? సాయంత్రం కురిసిన…
Hyd Rains : సోమవారం సాయంత్రం హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. ఒక్కసారిగా కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షం నగరంలో రహదారులను జలమయం చేసింది. ట్రాఫిక్ నిలిచిపోయి, తక్కువ ఎత్తులోని ప్రాంతాలు నీటమునిగాయి. సికింద్రాబాద్లో ప్యారడైజ్, మర్రెడ్పల్లి, తార్నాక వంటి ప్రధాన రహదారులు వర్షపు నీటితో మునిగిపోయాయి. సాయంత్రం ఆఫీస్ సమయాల్లో వర్షం కురవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రెండు చక్రాల వాహనదారులు, పాదచారులు వర్షం నుండి తప్పించుకోవడానికి ఫ్లైఓవర్లు, దుకాణాల షేడ్ల కింద…