Kalvakuntla Kavitha : అది సమయం, సందర్భం బట్టి.. కొత్త పార్టీపై కీలక వ్యాఖ్యలు
- యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కవిత
- “ప్రజలకు మేలు జరగాలంటే పార్టీ అవసరం లేదు” – కవిత
- నాలుగు నెలలపాటు 33 జిల్లాల్లో ‘జనం బాట’ కార్యక్రమం
- ఆలయ పవిత్రత కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalvakuntla Kavitha : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడుతూ.. “సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ, రాజకీయాల గురించి తప్పకుండా మాట్లాడుతాను. ప్రజలకు మేలు జరగాలంటే పార్టీలు అవసరం అనేది తప్పనిసరి కాదు. ప్రజలు కోరుకుంటే, సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుంది” అని అన్నారు.
జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదని, కానీ అది సమయం, సందర్భం, ప్రజల అవసరాలపై ఆధారపడి ఉంటుందని కవిత స్పష్టం చేశారు. “ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడమే మా లక్ష్యం. అందుకే ప్రతి జిల్లాలో ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ‘జనం బాట’ కార్యక్రమం ప్రారంభించాం” అని తెలిపారు. అంతేకాకుండా.. “మొత్తం 33 జిల్లాల్లో నాలుగు నెలల పాటు ‘జనం బాట’ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులు గడిపి స్థానిక సమస్యలను తెలుసుకుంటాం. మేధావులు, మహిళలు, యువతతో సమావేశమవుతాం. ప్రభుత్వం చేస్తున్న పనితీరు, ప్రతిపక్షాల వైఖరి గురించి కూడా ప్రజలతో చర్చిస్తాం” అని చెప్పారు. అలాగే, యాదగిరిగుట్ట ఆలయ పవిత్రతను కాపాడేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. “జనం బాట అవాంతరాలు లేకుండా సాగేందుకు స్వామివారిని ప్రార్థించాను. ప్రజలకు మేలు జరిగేలా జాగృతి తన శక్తి సామర్థ్యాలను వినియోగిస్తుంది” అని ఆమె పేర్కొన్నారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
YCP ZPTC Murder: వైసీసీ జడ్పీటీసీ దారుణ హత్య.. ఇద్దరు మహిళలు సహా ఏడుగురు నిందితుల అరెస్ట్..
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!