Kalvakuntla Kavitha : అది సమయం, సందర్భం బట్టి.. కొత్త పార్టీపై కీలక వ్యాఖ్యలు
- యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కవిత
- “ప్రజలకు మేలు జరగాలంటే పార్టీ అవసరం లేదు” – కవిత
- నాలుగు నెలలపాటు 33 జిల్లాల్లో ‘జనం బాట’ కార్యక్రమం
- ఆలయ పవిత్రత కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalvakuntla Kavitha : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడుతూ.. “సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ, రాజకీయాల గురించి తప్పకుండా మాట్లాడుతాను. ప్రజలకు మేలు జరగాలంటే పార్టీలు అవసరం అనేది తప్పనిసరి కాదు. ప్రజలు కోరుకుంటే, సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుంది” అని అన్నారు.
జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదని, కానీ అది సమయం, సందర్భం, ప్రజల అవసరాలపై ఆధారపడి ఉంటుందని కవిత స్పష్టం చేశారు. “ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడమే మా లక్ష్యం. అందుకే ప్రతి జిల్లాలో ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ‘జనం బాట’ కార్యక్రమం ప్రారంభించాం” అని తెలిపారు. అంతేకాకుండా.. “మొత్తం 33 జిల్లాల్లో నాలుగు నెలల పాటు ‘జనం బాట’ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులు గడిపి స్థానిక సమస్యలను తెలుసుకుంటాం. మేధావులు, మహిళలు, యువతతో సమావేశమవుతాం. ప్రభుత్వం చేస్తున్న పనితీరు, ప్రతిపక్షాల వైఖరి గురించి కూడా ప్రజలతో చర్చిస్తాం” అని చెప్పారు. అలాగే, యాదగిరిగుట్ట ఆలయ పవిత్రతను కాపాడేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. “జనం బాట అవాంతరాలు లేకుండా సాగేందుకు స్వామివారిని ప్రార్థించాను. ప్రజలకు మేలు జరిగేలా జాగృతి తన శక్తి సామర్థ్యాలను వినియోగిస్తుంది” అని ఆమె పేర్కొన్నారు.
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
YCP ZPTC Murder: వైసీసీ జడ్పీటీసీ దారుణ హత్య.. ఇద్దరు మహిళలు సహా ఏడుగురు నిందితుల అరెస్ట్..
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?