KTR : సీఎం, మంత్రుల పంపకాల పరంపర.. రాష్ట్ర పరువుకు మచ్చ
- కేటీఆర్ ప్రెస్ మీట్లో రాష్ట్రంలోని అవినీతి, పంపకాలపై విమర్శ
- రిజ్వి రిటైర్మెంట్, టెండర్ వివాదంపై ఘాటైన వ్యాఖ్యలు
- పారిశ్రామిక వేత్తల బెదిరింపు, సెటిల్మెంట్ల పై ఆసక్తికర వ్యాఖ్యలు
- కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలు తెలుగు ప్రజలకు తలవంచుకునే పరిస్థితి తెచ్చాయని ఆయన విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మచ్చలాంటివి. ఐఏఎస్ అధికారులను బలి పశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది,” అని అన్నారు. నిజాయితీ పరుడిగా పేరున్న రిజ్వి వలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సీఎం అల్లుడు, మంత్రి కుమారుడి మధ్య టెండర్ వివాదం కారణంగా ఒక అధికారి పదవి వదిలేయాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర పరిపాలన దిగజారిపోతున్నదనే సంకేతమని కేటీఆర్ విమర్శించారు. “ఈ ప్రభుత్వం నడుపుతోంది ముమ్మాటికీ దండుపాళ్యం ముఠా లాగే,” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అధికారులు జైలుకు వెళ్లారని గుర్తుచేస్తూ, “ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే జైలుకు వెళ్లాల్సిందే. ఈ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా దెబ్బతీసింది. ముఖ్యమంత్రి ఇల్లు పరిపాలనా కేంద్రమా లేక సెటిల్మెంట్ల అడ్డానా?” అని ప్రశ్నించారు.
Also Read
తాజాగా వెలుగులోకి వచ్చిన తుపాకీ వివాదంపై కూడా కేటీఆర్ స్పందించారు. “మంత్రి కుమార్తె చెప్పింది.. సీఎం రేవంత్ రెడ్డి తుపాకీ ఇచ్చారని. మరోవైపు కొండా మురళి తుపాకీ ఇచ్చారని అంటున్నారు. ఏది అయినా సరే పారిశ్రామికవేత్తను బెదిరించడం నిజమే. పోలీసులు నిజాయితీ వంతులు అయితే దోషులను అరెస్ట్ చేయాలి,” అని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పరిధిలో రౌడీ మూకల ర్యాలీలు, పోలీసుల వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు.
“నా జీవితంలో మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం చూడలేదు. కానీ ఈ రోజుల్లో అది కూడా జరుగుతోంది. ఇది పాలనా పతనానికి సంకేతం,” అని అన్నారు. అంతేకాకుండా.. “ఇలాంటి సెటిల్మెంట్ల ముఖ్యమంత్రిని నేను ఇప్పటి వరకు చూడలేదు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్–బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం. బీజేపీ నేతలు, ముఖ్యంగా బండి సంజయ్ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు?” అని ప్రశ్నించారు.
Rohit Sharma: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా గడ్డపై రికార్డు..!
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!