Koti ATM Gun Fire: కోఠి కాల్పుల కేసులో పురోగతి.. వేట మొదలుపెట్టిన ప్రత్యేక బృందాలు.!
- నగరాన్ని షాక్కు గురిచేసిన కోఠి ఏటీఎం కాల్పులు
- డిపాజిట్ చేస్తుండగా వ్యాపారిపై ఫైరింగ్.. రూ.6 లక్షల దోపిడీ
- రైలులో పరారీ.. సీసీటీవీతో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
- అంతర్రాష్ట్ర గ్యాంగ్ అనుమానం.. ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కోఠి బ్యాంక్ స్ట్రీట్లో శుక్రవారం ఉదయం జరిగిన తుపాకీ కాల్పులు, భారీ దోపిడీ ఉదంతం నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఏటీఎం సెంటర్లో నగదు డిపాజిట్ చేస్తున్న వ్యాపారిపై కాల్పులు జరిపి ₹6 లక్షలు దోచుకెళ్లిన ఈ కేసును పోలీసులు అత్యంత సవాలుగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ దర్యాప్తులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. నిందితులిద్దరూ నేరం చేసిన వెంటనే అత్యంత వ్యూహాత్మకంగా నగరం విడిచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
కేరళ రాష్ట్రం కోజికోడ్కు చెందిన రిన్షాద్ అనే 26 ఏళ్ల యువ వస్త్ర వ్యాపారి, సరుకు కొనుగోలు కోసం తన వద్ద ఉన్న ₹6 లక్షల నగదును డిపాజిట్ చేయడానికి శుక్రవారం ఉదయం కోఠిలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎానికి చేరుకున్నారు. ఆయన నగదు డిపాజిట్ చేస్తున్న సమయంలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి తుపాకీతో బెదిరించారు. రిన్షాద్ వారిని ప్రతిఘటించడంతో దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో ఒక బుల్లెట్ ఆయన కుడి కాలికి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇదే తరుణంలో దుండగులు నగదు బ్యాగుతో పాటు ఆయన వాహనాన్ని కూడా తీసుకుని చాదర్ఘాట్ వైపు వేగంగా తప్పించుకున్నారు.
Also Read
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
- Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
- Shocking: జిమ్కు వెళ్తుందని భార్య దారుణహత్య..
- IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
దోపిడీ అనంతరం నిందితులు పోలీసులకు దొరక్కుండా పక్కా ప్లాన్ అమలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వారు బాధితుడి వాహనంపై నింబోలిఅడ్డ , కాచిగూడ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వాహనాన్ని వదిలేశారు. ఆ తర్వాత తమ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు వెంటనే దుస్తులు మార్చుకుని, కాలినడకన కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్పష్టమైంది. ఉదయం కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరిన ఒక రైలులో వీరిద్దరూ పరారైనట్లు పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. ఈ సమాచారం ఆధారంగా రైల్వే పోలీసుల సహకారంతో నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన తీరును బట్టి చూస్తే, ఇది స్థానిక నేరగాళ్ల పని కాదని, పక్కా ప్రొఫెషనల్ గ్యాంగ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఢిల్లీ, హర్యానా లేదా ముంబైకి చెందిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులై ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరిని పట్టుకునేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ ఇప్పటికే ప్రత్యేక క్రైమ్ టీమ్లను రంగంలోకి దించింది. నిందితులు వెళ్లినట్లు భావిస్తున్న రూట్లలోని అన్ని రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేయడంతో పాటు, ఇతర రాష్ట్రాల పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు.
సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం , దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితుడు రిన్షాద్ ఇచ్చిన సమాచారం , సాంకేతిక ఆధారాలతో వేట మొదలుపెట్టారు. నగర ప్రజల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, త్వరలోనే నిందితులను చట్టం ముందు నిలబెడతామని అధికారులు స్పష్టం చేశారు. ఎవరికైనా ఈ ఘటనకు సంబంధించి లేదా నిందితులకు సంబంధించి ఏదైనా అనుమానాస్పద సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు.
Viral : టాబ్లెట్ షీట్ అనుకున్నారా..? అది వెడ్డింగ్ కార్డు..!
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!