Koti ATM Gun Fire: కోఠి కాల్పుల కేసులో పురోగతి.. వేట మొదలుపెట్టిన ప్రత్యేక బృందాలు.!
- నగరాన్ని షాక్కు గురిచేసిన కోఠి ఏటీఎం కాల్పులు
- డిపాజిట్ చేస్తుండగా వ్యాపారిపై ఫైరింగ్.. రూ.6 లక్షల దోపిడీ
- రైలులో పరారీ.. సీసీటీవీతో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
- అంతర్రాష్ట్ర గ్యాంగ్ అనుమానం.. ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కోఠి బ్యాంక్ స్ట్రీట్లో శుక్రవారం ఉదయం జరిగిన తుపాకీ కాల్పులు, భారీ దోపిడీ ఉదంతం నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఏటీఎం సెంటర్లో నగదు డిపాజిట్ చేస్తున్న వ్యాపారిపై కాల్పులు జరిపి ₹6 లక్షలు దోచుకెళ్లిన ఈ కేసును పోలీసులు అత్యంత సవాలుగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ దర్యాప్తులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. నిందితులిద్దరూ నేరం చేసిన వెంటనే అత్యంత వ్యూహాత్మకంగా నగరం విడిచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
కేరళ రాష్ట్రం కోజికోడ్కు చెందిన రిన్షాద్ అనే 26 ఏళ్ల యువ వస్త్ర వ్యాపారి, సరుకు కొనుగోలు కోసం తన వద్ద ఉన్న ₹6 లక్షల నగదును డిపాజిట్ చేయడానికి శుక్రవారం ఉదయం కోఠిలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎానికి చేరుకున్నారు. ఆయన నగదు డిపాజిట్ చేస్తున్న సమయంలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి తుపాకీతో బెదిరించారు. రిన్షాద్ వారిని ప్రతిఘటించడంతో దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో ఒక బుల్లెట్ ఆయన కుడి కాలికి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇదే తరుణంలో దుండగులు నగదు బ్యాగుతో పాటు ఆయన వాహనాన్ని కూడా తీసుకుని చాదర్ఘాట్ వైపు వేగంగా తప్పించుకున్నారు.
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
దోపిడీ అనంతరం నిందితులు పోలీసులకు దొరక్కుండా పక్కా ప్లాన్ అమలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వారు బాధితుడి వాహనంపై నింబోలిఅడ్డ , కాచిగూడ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వాహనాన్ని వదిలేశారు. ఆ తర్వాత తమ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు వెంటనే దుస్తులు మార్చుకుని, కాలినడకన కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్పష్టమైంది. ఉదయం కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరిన ఒక రైలులో వీరిద్దరూ పరారైనట్లు పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. ఈ సమాచారం ఆధారంగా రైల్వే పోలీసుల సహకారంతో నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన తీరును బట్టి చూస్తే, ఇది స్థానిక నేరగాళ్ల పని కాదని, పక్కా ప్రొఫెషనల్ గ్యాంగ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఢిల్లీ, హర్యానా లేదా ముంబైకి చెందిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులై ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరిని పట్టుకునేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ ఇప్పటికే ప్రత్యేక క్రైమ్ టీమ్లను రంగంలోకి దించింది. నిందితులు వెళ్లినట్లు భావిస్తున్న రూట్లలోని అన్ని రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేయడంతో పాటు, ఇతర రాష్ట్రాల పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు.
సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం , దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితుడు రిన్షాద్ ఇచ్చిన సమాచారం , సాంకేతిక ఆధారాలతో వేట మొదలుపెట్టారు. నగర ప్రజల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, త్వరలోనే నిందితులను చట్టం ముందు నిలబెడతామని అధికారులు స్పష్టం చేశారు. ఎవరికైనా ఈ ఘటనకు సంబంధించి లేదా నిందితులకు సంబంధించి ఏదైనా అనుమానాస్పద సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు.
Viral : టాబ్లెట్ షీట్ అనుకున్నారా..? అది వెడ్డింగ్ కార్డు..!
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..