Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు (శుక్రవారం) రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…
కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో డీజీపీతో మహేందర్రెడ్డితో కలిసి CS సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 16, 17,18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వక్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని CS అధికారులను ఆదేశించారు. భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రేపటి నుంచి (16)వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. Read also:National Integrations…
Kakatiya Mega Textile Park: కాకతీయ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఆరేళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో చీరల తయారీ ప్రారంభమైంది. ఈ పార్క్ను చేనేత మరియు జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఈ పార్క్ను 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అక్కడ 364కి పైగా పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి.
New Director to NIMS: నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కి కొత్త డైరెక్టర్ రానున్నారు. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ మనోహర్.. గుండె పోటుతో నాలుగు రోజుల కిందట హైదర్గూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకి ఆ ఆస్పత్రిలోనే సర్జరీ చేయనుండటం, దీనివల్ల దీర్ఘకాలం ట్రీట్మెంట్ పొందాల్సి ఉండటంతో నిమ్స్కి కొత్త డైరెక్టర్ని నియమించకతప్పని పరిస్థితి నెలకొంది.
Telangana Assembly: తెలంగాణ శాసన సభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6 నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను ఎప్పటివరకు కొనసాగించాలనేది ఆ రోజు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్లో నిర్ణయిస్తారని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తెలిపారు. అజెండాను కూడా ఆ రోజే చర్చించి ఖరారు చేస్తారని చెప్పారు. మునుగోడు శాసన సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఇబ్రహీం పట్టణంలో జరిగిన ఘటన చాలా బాధాకరమని తెలిపారు. వెంటనే మా అధికారులు స్పందించారు. 30 మందిలో కొంత మంది ను నిమ్స్, అపోలో ఆస్పత్రికి తరలించామన్నారు. ఇప్పుడు అందరూ సేఫ్ గా ఉన్నారన్నారు. నిమ్స్ లో 17 మంది ఉన్నారని తెలిపారు. అపోలో ఆస్పత్రిలో 13 మంది ఉన్నారన్నారు. రెండు మూడు రోజులలో అందరిని డిశ్చార్జ్ చేస్తున్నామన్నారు. 5, 6 ఏళ్లలో 12 లక్షల అపరేషన్…
First Water School in Hyderabad: జలక్రీడలకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి వాటర్ స్కూల్ని హైదరాబాద్లో నిన్న ప్రారంభించింది. ఈ ఎక్స్క్లూజివ్ స్కూల్ని మాదాపూర్లోని దుర్గం చెరువు ప్రాంతంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మునిసిపల్ వ్యవహారాలు-పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆరంభించారు. సెయిలింగ్, కయాకింగ్, విండ్ సర్ఫింగ్, స్టాండప్ ప్యాడ్లింగ్తోపాటు ఇతర జల అనుబంధ క్రీడలను ఇక్కడ నేర్పిస్తారు.