YS Sharmila: కేసీఆర్ నన్ను టార్గెట్ చేసిండు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ కు తరలించారు. లోటస్ పాండ్ వైఎస్ఆర్టీపీ కార్యాలయం వద్ద వైఎస్ షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ మరోసారి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి నన్ను టార్గెట్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది పోయి ఇలా అణగదొక్కడం భావ్యమేనా? అని ప్రశ్నించారు.
Read Also: Revanth Reddy : కేసీఆర్, కేజ్రీవాల్, అసదుద్దీన్ ముగ్గురూ సుపారీ కిల్లర్స్
Also Read
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- Monsoon Cleaning Tips: ఈగలు, చీమలు ఇంట్లోకి వస్తున్నాయా..? నీటిలో ఇవి కలిపితే మంచి ఫలితాలు..
- BCCI New Rules: దేశీయ క్రికెట్లో కొత్త రూల్స్.. చివరి ఓవర్ నుంచి వైడ్ వరకు కీలక మార్పులు..!
ఈ రోజుతో కెసీఆర్ కు తెలంగాణ కు బంధం తెగిపోయిందని వైఎస్ షర్మిల అన్నారు. దోచుకోవడానికి తెలంగాణ లో ఇక ఏం మిగలలేదు.. అందుకే ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు వెళ్తున్నాడంటూ ఆరోపించారు. నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసి ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలని కేసీఆర్ ను షర్మిల డిమాండ్ చేశారు. ఆయన బిడ్డ లిక్కర్ మాఫియా, కొడుకు లాండ్ మాఫియా లో ఉన్నారన్నారు. వారి అవినీతిని ప్రశ్నినందుకే ఇలా తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘మా వాళ్ళని కొట్టారు.. నన్ను గాయపరిచారు… పాదయాత్ర ని ఆపారు. పోలీస్ డిపార్ట్మెంట్ కెసిఆర్ తోత్తులుగా మారారు. నన్ను బలవంతంగా తీసుకొచ్చారు… మా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఇంత వరకు వదలలేదు. పోలీసులు హింసిస్తున్నారు. కెసిఆర్ అవినీతిని మేము మాత్రమే ప్రశిస్తున్నం. ప్రజలంతా చూస్తున్నారు… చుట్టుపక్కల అంతా కర్ఫ్యూ పెట్టారు .కనీసం పచ్చి మంచి నీళ్ళు నేను ముట్టుకొను.’ వైఎస్ షర్మిల తన దీక్షను నాలుగు గంటలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని షర్మిల అన్నారు.
తాజావార్తలు
-
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
-
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
-
Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
-
Monsoon Cleaning Tips: ఈగలు, చీమలు ఇంట్లోకి వస్తున్నాయా..? నీటిలో ఇవి కలిపితే మంచి ఫలితాలు..
-
Team India: వైభవ్ సూర్యవంశీలా.. ఆ స్టార్ ఆటగాడి కెరీర్ను కూడా గంభీర్ నాశనం చేస్తున్నాడు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!