YS Sharmila: కేసీఆర్ నన్ను టార్గెట్ చేసిండు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ కు తరలించారు. లోటస్ పాండ్ వైఎస్ఆర్టీపీ కార్యాలయం వద్ద వైఎస్ షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ మరోసారి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి నన్ను టార్గెట్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది పోయి ఇలా అణగదొక్కడం భావ్యమేనా? అని ప్రశ్నించారు.
Read Also: Revanth Reddy : కేసీఆర్, కేజ్రీవాల్, అసదుద్దీన్ ముగ్గురూ సుపారీ కిల్లర్స్
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఈ రోజుతో కెసీఆర్ కు తెలంగాణ కు బంధం తెగిపోయిందని వైఎస్ షర్మిల అన్నారు. దోచుకోవడానికి తెలంగాణ లో ఇక ఏం మిగలలేదు.. అందుకే ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు వెళ్తున్నాడంటూ ఆరోపించారు. నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసి ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలని కేసీఆర్ ను షర్మిల డిమాండ్ చేశారు. ఆయన బిడ్డ లిక్కర్ మాఫియా, కొడుకు లాండ్ మాఫియా లో ఉన్నారన్నారు. వారి అవినీతిని ప్రశ్నినందుకే ఇలా తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘మా వాళ్ళని కొట్టారు.. నన్ను గాయపరిచారు… పాదయాత్ర ని ఆపారు. పోలీస్ డిపార్ట్మెంట్ కెసిఆర్ తోత్తులుగా మారారు. నన్ను బలవంతంగా తీసుకొచ్చారు… మా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఇంత వరకు వదలలేదు. పోలీసులు హింసిస్తున్నారు. కెసిఆర్ అవినీతిని మేము మాత్రమే ప్రశిస్తున్నం. ప్రజలంతా చూస్తున్నారు… చుట్టుపక్కల అంతా కర్ఫ్యూ పెట్టారు .కనీసం పచ్చి మంచి నీళ్ళు నేను ముట్టుకొను.’ వైఎస్ షర్మిల తన దీక్షను నాలుగు గంటలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని షర్మిల అన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!