హైదరాబాద్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ - 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఈ-మొబిలిటీ వ్యాలీలో భాగంగా వారం రోజుల పాటు హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ను నిర్వహించనున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 16 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మొదటి నుంచి బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్ రిమార్క్స్ తో దూసుకుపోతున్న కేటీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లా పర్యటనలో ప్రధానంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు కొనసాగించారు.
KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మనోహరాబాద్లో రూ.460 కోట్ల పెట్టుబడితో 59ఎకరాల్లో నిర్మించిన ఐటీసీ పరిశ్రమను ప్రారంభించారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్లో సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు.
హైదరాబాద్లోని సికింద్రాబాద్ నల్లగుట్ట డెక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదు రోజుల కావస్తున్నా ఇంకా అదృశ్యమైన యువకుల ఆచూకీ లభించక పోవడంతో కలకలం రేపుతుంది. పోలీసులు అగ్నిమాపక శాఖ, డీఆర్ఎఫ్, క్లూస్ టీమ్ సిబ్బంది భవనంలోని అన్ని అంతస్తుల్లోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించినా ఫలితం దక్కలేదు.
ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతరకు వేళయింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది.
నగరం లోపల, వెలుపల పెద్ద ఎత్తున అక్రమ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా పురపాలక శాఖ మంత్రికి పట్టదని ఆయన విమర్శించారు.
సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో రెండు రోజులు గడుస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. నిన్నటి నుంచి ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న మంటలు అదుపులోకి రావడం లేదు. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథపై వివాదం మరింత వేడెక్కుతోంది. తోటి విద్యార్థులను దూషించి కొట్టిన ఓ వీడియో ఇప్పటికే వైరల్గా మారగా.. ఇప్పుడు మరో వీడియో విడుదల కావడం సంచలనంగా మారింది.