Petrol Fraud: లీటర్కు బదులుగా అరలీటరు.. హెచ్పీ పెట్రోల్ బంక్లో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Fraud: వాహనం ప్రస్తుత రోజుల్లో ఓనిత్యావసర వస్తువు. అయితే.. గతంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఆర్టీ సీ బస్సులు, రైల్వేను ఆశ్రయించే వారు. ఇక.. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది వాహనాలను వినియోగిస్తూ ప్రజలు తమ పనుల ను చేసుకుంటున్నారు. మనం ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే వాహనం తీయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కాగా.. వాహనం నడవాలంటే పెట్రోల్, డీజిల్ కీలకం. తమ బడ్జెట్ను బ్యాలెన్స్ చేసుకుంటూ బంక్లో పెట్రోల్, డీజిల్ను వాహనాలలో పోయించుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అసలే ధరల పెరుగుదల ఒకవైపు.. విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంక్ లో మామూలుగానే మోసాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ లీటర్ పెట్రోల్ బదులు అరలీటర్ వేయడంతో ప్రయాణికులు లబోదిబో మంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్ లో గల హెచ్పీ పెట్రోల్ బంకులో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read also: World Sleep Day: ఉద్యోగులకు కంపెనీ ‘సర్ప్రైజ్ గిఫ్ట్’.. ఈ రోజంతా హాయిగా నిద్రపోవాలంటూ..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్ లో గల హెచ్పీ పెట్రోల్ బంకులో ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్ పోయించుకున్నాడు. అయితే ఇక్కడే అసలు మోసం బయట పడింది. తను లీటర్ పెట్రోల్ పోయమంటే.. అరలీటర్ పోయడం గమనించాడు. తను లీటర్ వేయమన్నాను కానీ పెట్రోల్ బంక్ నిర్వాహకుడు అరలీటరే పోసాడంటూ నిలదీసాడు.. కానీ.. పెట్రల్ బంక్ నిర్వాహకులు ఎవరూ స్పందించలేదు. అయితే.. విషయం గుర్తించి సదరు యువకుడు వారితో గొడవకు దిగాడు. ఎవరూ సరైన స్పందన లేకపోవడంతో పెట్రోల్ బంక్ లోనే పెట్రోల్ బాటిళ్లతో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. వారందరూ.. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. మోసానికి పాల్పడిన పెట్రోల్ బంకును సీజ్ చేశారు. అయితూ.. అనుమానం వచ్చి మూడు బాటిళ్లలో మూడు లీటర్ల పెట్రోల్ చొప్పున పెట్రోల్ పోయించుకోగా అందులో ఒక్క బాటిల్ లో మాత్రమే సరిగా పెట్రోల్ పోశారు. ఈ..విషయమై పెట్రోల్ బంకు నిర్వాహకులను నిలదీస్తే సరైన సమాధానం ఇవ్వలేదని బాధిత ద్విచక్ర వాహనదారుడు వాపోయాడు. అందుకే స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. ఇలా పెట్రోల్ బంక్ లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించే కఠినంగా శిక్షించాలని, అలాంటి పెట్రోల్ బంక్లను సీజ్ చేయాలని సదరు వాహనదారులు కోరుతున్నారు.
Farmers worried: వడగళ్ల వానతో నీట మునిగిన పంటలు.. ఆందోళనలో అన్నదాతలు
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..