Tragedy: పెళ్లై ఏడాదైంది. భార్యను పుట్టింటినుంచి తీసుకుని ఇంటికి పయనమయ్యాడు యువకుడు. ఎంతో ఆనందంలో ముచ్చట్ల నడుమ బైకుపై సాగింది వారి ప్రయాణం. అలా సాగుతుండగా రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ పడింది.
Heart Attack: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాదులో కానిస్టేబుల్ జిమ్ లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మరణించిన ఘటన మరువక ముందే..
Missing girls: హైదరాబాద్ తిరుమలగిరిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చిన ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. 24 గంటలు గడిచినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పిల్లలను త్వరగా కనిపెట్టి క్షేమంగా ఇంటికి చేర్చాలని పోలీసులను వేడుకుంటున్నారు. Read also: Theft in the temple: ఆలయంలోనే కన్నం వేద్దామనుకున్నాడు.. ఇంతలోనే.. ఏం జరిగింది? హైదరాబాద్ లోని తిరుమలగిరికి చెందిన పరిమలా…
గుడిలో దొంగతనానికి వచ్చాడు. హుండీ పగులగొట్టే పనిలో ప్రపంచాన్నే మరిచిపోయాడు. విషయం గమనించిన ఆలయ వాచ్మెన్ అక్కడికి వచ్చి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ 69 జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు నిర్వహిస్తుంది. కేసీఆర్ పెట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈనేపథ్యంలో.. సిద్దిపేట జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్ని కేక్ కట్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సికింద్రాబాద్ రైలు నిలయంలోని పాత క్వార్టర్స్లో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలోని చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అఖిల్ సాయి మరణం పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో ప్రాణాలు విడిచిన అఖిల్ సాయిపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన ఆయన తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే అఖిల్ సాయి మృతదేహాన్ని తెలంగాణకు తెప్పించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.