Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఇటీవల కురిసిన వడగళ్ల వర్షం వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ నేడు పర్యటన చేయనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు.
* నేడు సిట్ 6వ రోజు 9మంది నిందితుల విచారించనుంది. టీఎస్పీఎస్సీ నేడు 11 గంటలకు సిట్ ఎదుట పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ కేసులో ముగ్గురిని ఎఫ్ ఐ ఆర్ కాపీ నిందితుల జాబితాలో చేర్చిన సిట్. దీంతో.. మొత్తం 12కు చేరుకున్న నిందితులు సంఖ్య.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
* ఉద్యానశాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 4న నిర్వహించాల్సిన పరీక్షపై గురువారం టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఈ పరీక్షను నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై చర్చించనున్నది.
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* ఆదిలాబాద్ కేంద్రంలో సిపిఎం జన చైతన్య యాత్ర. పట్టణం లో బైక్ ర్యాలీ తరువాత ఆర్ అండ్ బి ముందు బహిరంగ సభ. హాజరు కానున్న పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.
* తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావావరణ శాఖ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగండ్లతో కూడిన భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ అలాంటి వర్షాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నది.
* విశాఖలో పాత రామజోగిపేటలో ఘోర ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.
* ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. ఇందులో వైఎస్సార్సీపీకి 151 మంది సభ్యులు ఉండగా.. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు.
* ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న సభలో పలు బిల్లులు, పలు శాఖల డిమాండ్లకు సభ్యులు ఆమోదం తెలపనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
- Tags
- andra pradesh
- cm jagan
- cm kcr
- india
- modi
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!