Errabelli Dayakar Rao: విపక్షాలకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్.. ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదని ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao Gives Checks To Warangal Farmers: గతేడాది వరంగల్లోని నర్సంపేట్లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు మంత్రి దయాకర్ రావు నష్టపరిహారాన్ని అందించారు. నష్టపోయిన రైతులకు పరిహారం 8 కోట్ల 89 లక్షల 43 వేల 45 రుపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టం విషయంలో కేంద్రం చొరవ చూపించడం లేదని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.17 కోట్లకు పైగా నష్టపరిహారం ఇస్తున్నాం అన్నారు. 13,500 హెక్టార్కి మిర్చికి నష్ట పరిహారం ఇస్తున్నామని.. పెట్టుబడిలో పావు వంతు కూడా రావడం లేదని అన్నారు. ఇంతివ్వాలి, అంతివ్వాలి అని అడిగేవాళ్లు.. వాళ్ల రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా అకాల వర్షాలు పడ్డాయని.. కానీ ఆయా రాష్ట్రల్లో ఇప్పటివరకూ సర్వేలు చేయలేదన్నారు. కానీ.. తెలంగాణలో ప్రాథమిక సర్వేలు పూర్తి చేశామన్నారు. యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారన్నారు.
Etela Rajender: కవిత విచారణ కుట్ర అయితే.. కోర్టు తేలుస్తుంది
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
లక్షా 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సర్వే రిపోర్ట్లో వచ్చింది.. 91 వేల మంది రైతులు నష్టపోయారని తేలినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ముఖ్యంగా.. వరంగల్ జిల్లాలో రైతులకు ఎక్కవ నష్టం జరిగిందన్నారు. 28 వేల 500 ఎకరాల్లో పంట నష్టం కాగా.. 2600 మంది రైతులు నష్టపోయారన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని ఎవ్వరు పూడ్చలేరన్నారు. పక్క పార్టీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతారు, ఇంకా ఏమోమో హంగామా సృష్టిస్తారని.. కానీ రైతులు అసలు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. విపక్షాలు తమ రాష్ట్రాల్లో ఏం చేశాయో తెలుసుకొని చెప్పాలని, ఇక్కడ ధర్నాలు చేయాలని చెప్పారు. అధికారులు రైతుల వద్దకే వస్తారని.. పూర్తిగా నష్టపోయిన పంట వివరాల్ని అందించాలని చెప్పారు. ఆరోగ్యం బాగా లేకున్నా.. రైతుల కోసం సీఎం కేసీఆర్ రెండు, మూడు రోజుల్లో నర్సంపేట్కి వస్తున్నారన్నారు. స్వయంగా సీఎం ఈ ప్రాంతాల్లో పర్యటించడంతో.. ఇక్కడి రైతులకు ఎక్కవ లాభం జరుగుతుందని తెలియజేశారు.
SI Saved 16 Members Life: సెల్యూట్ ఎస్సై సార్.. 16 మంది ప్రాణాలు కాపాడారు..
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!