Harrassed : బండిపై వెళ్తున్న యువతిని కొట్టిన యువకులు.. మద్యంమత్తులో వీరంగం..
హైదరాబాద్ లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ తానా పరిధిలో బండి మీద వెళ్తున్న యువతిపై కొందరు వ్యక్తులు కర్రతో దాడి చేశారు. ఆ దాడిలో కిందపడిన యువతి జట్టు పట్టి లాగి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని అడ్డగుట్ట సొసైటీలో ఉన్న ఓ ఉమెన్స్ హస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. శనివారం ఆమె మరో ఆరుగురు స్నేహితులు కలిసి బంజారహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న బిర్యానీ వాలాకు వెళ్లేందుకు మూడు బండ్ల మీదు వెళ్లారు.
Also Read : Lord Shiva Sahasranama Stotram: చైత్ర సోమవారం నాడు ఈ స్తోత్రాలు వింటే మనోభీష్టాలు నెరవేరుతాయి..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఓ బైక్ మీద వెనక యువతి కూర్చింది. బేగంపేట్ వైపు నుంచి బంజారాహిల్స్ రావడానికి జీపీఎస్ పెట్టుకున్నారు. పంజాగుట్ట సర్కిల్ వరకు బాగానే వచ్చారు. ఆ తర్వాత గూగుల్ మ్యాప్ లో రోడ్డు పంజాగుట్ట స్మశాన వాటిక దగ్గర కొత్తగా వేసిన బ్రిడ్జ్ మీద నుంచి చూపించింది. మ్యాప్ ని ఫాలో అవుతూ ఆ దారిలో వాళ్లు వెళ్లారు.. ఇంతలో అదే దారిలో ఇద్దరు యువకులు మరో బైక్ మీద వెళ్తూ ఆమెను అవమానకరంగా కామెంట్స్ చేశారు. వారిద్దరు మద్యం మత్తులో ఉన్నారు. వీళ్లు వారిని దాటుకుని ముందుకు వెళ్లిపోయారు. అయితే.. అది డెడ్ ఎండ్ కావడం.. అటు నుంచి దారి లేకపోవడం మ్యాచ్ రాంగ్ రూడ్ చూపించడంతో అదే దారిలో మళ్లీ వెనక్కి వచ్చారు.
Also Read : Boxing : భారత్ కు మరో రెండు స్వర్ణాలు.. నిఖత్, లవ్లీనా జోరు
ఈ క్రమంలో అంతకుముందు మద్యం తాగి అమ్మాయిని తిట్టిన యువకుల్లో ఒకరు ఆమె మీద కర్రతో దాడి చేశాడు. మరొకడు ఆమె జుట్టుపట్టుకుని లాగాడు. దీంతో అమ్మాయి కింద పడిపోయింది. ఆమె జట్టు పట్టుకొని అలాగే వారిద్దరూ కొంత దూరం లాక్కెళ్లారు. ఇది గమనించిన అమ్మాయితో వచ్చిన మిగతా స్నేహితులు ఆ ఇద్దరినీ పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. అమ్మాయి మీద దాడి చేసిన ఆ యువకులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు పంజాగుట్టకు చెందిన కొండ గోపి, మరో యువకుడు పంజాగుట్ట పోచమ్మ బస్తికి చెందిన పుణ్యసాయి కళ్యాణ్ గా గుర్తించారు.
Also Read : TSRTC: రోడ్డెక్కుతున్న లహరి బస్సులు.. అదిరిపోయే ప్రత్యేకలు ఇవే..
సంబంధం లేని యువతితో సదరు యువకులు గొడవకు దిగడానికి గల కారణం మద్యం మత్తే అని పోలీసులు తేల్చారు. అంతకుముందే వారికి మరో యువతితో గొడవ జరిగినట్లు వెల్లడించారు. కొద్ది సేపటికి అటుగా వెళ్తున్న ఈ యువతిని చూసి.. ఆ యువతి ఈమె అనుకుని దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు పోలీసులు అన్నారు. స్నేహితులతో పాటు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో యువకులపై కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!