CP Kothakota Srinivas Reddy: ఇన్స్పెక్టర్లకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పోస్టింగ్ విషయంలో కొందరు ఇన్స్పెక్టర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పోస్టింగ్ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. Also Read: Coronavirus: కరోనా అలజడి.. తెలంగాణలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు సిఫార్సు లేఖలు పట్టుకొచ్చే…
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శభవార్త అందించారు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్…
మైనర్ బాలికని అత్యాచారం చేసి గర్భవతిని చేసిన నేరస్తునికి నల్గొండ జిల్లా సెషన్స్ కోర్టు 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2012లో జరిగిన ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరిచించింది. 2012 డిసెంబర్ నల్గొండ శివారులోని ఆర్జాల బావి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నిజాముద్దీన్ అలియాస్ నిజ్జు (36) అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం…
సింగరేణి ఎన్నికలను బహిష్కరిచాలంటూ కార్మికులకు పిలుపునిస్తూ మావోయిస్టుల విడుదల చేసిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు అనుమతించిన అనంతరం మావోయిస్టు పార్టీ సింగరేణి కార్మిక సమఖ్య (సికాస) కార్యదర్శి ప్రభాత్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. సింగరేణి ఎన్నికలను బహిష్కరించాలని లేదంటే TBGKS నాయకులకు శిక్ష తప్పదంటూ లేఖలో హెచ్చరించారు. ‘పోరాటల ద్వారానే హక్కులు సాధించుకోవాలి. కార్మిక…
గత ప్రభుత్వం ఏం తప్పులు చేసిందో శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియాలో సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలపై స్పందించారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే సమయంలో ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. MIM కి గంటల తరబడి సమయం ఇచ్చారు… 8…
గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో మేము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచాం. అందుకే గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశాం. గత ప్రభుత్వం పాలనలో తప్పులు జరిగాయి. శ్వేత పత్రాలు నిజమేనని,…
అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ అంశంపై చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విమర్శలు, లేవనెత్తిన అంశాలను మీడియా ముందు జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసి బోర్లా పడిందని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన…
పదేళ్లలో తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశంలో నెంబర్ వన్గా నిలిపామని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డీ నొక్కి చెప్పారు. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా విద్యుత్పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్ బకాయిలు, కరెంట్ సరఫరాపై అధికార పార్టీ చేసిన విమర్శలకు, ప్రశ్నలకు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధీటూగా స్పందించారు. దేశంలో 24 గంటల విద్యుత్ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ…
శ్వేతపత్రం రాష్ట్రాన్ని దివాళా తీయడానికి పెట్టింది కాదని, వాస్తవం ఏంటన్నది ప్రజలకు పూర్తిగా అర్థం కావడానికే అన్నారు డిప్యూటీ సీఎం, మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో భట్టి శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2 పేజీలతో ఉన్న బుక్ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం శ్వేతపత్రంపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. దేశంతో పోటీపడాలనే రూపకల్పనతోనే శ్వేతపత్రం తీసుకువచ్చామన్నారు. నిధులు ఎలా వచ్చాయి.. ఎలా…
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి- ఫ్రీ బస్సు ఫథకానికి ఊహించని స్పందని వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రతిరోజూ 30 లక్షలకు పైగా మహిళలు ఈ పథకాన్ని వినియోగిస్తున్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించారు. మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా…