Nagoba Jatara: నేడు నాగోబా మహా పూజ.. తరలి రానున్న మెస్రం వంశీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న నాగోబా జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మేడారం తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు కేస్లాపూర్కు వచ్చి నాగోబాకు పూజలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు డీఎస్పీల ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, 28 మంది ఎస్సైలు, 37 మంది ఎస్సైలు, 94 మంది హెడ్ కానిస్టేబుళ్లతో పాటు 94, 243 మంది ఇతర సిబ్బందిని మోహరించారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభమవుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి(9, 10, 11) తేదీల్లో జరిగే జాతర 12న దర్బార్తో ముగుస్తుంది. కేస్లాపూర్లోని మర్రిచెట్టు వద్ద హస్తిన సరస్సుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నీటిని మెస్రం ప్రజలు ఇప్పటికే తీసుకొచ్చారు.
Read also: Anasuya : అబ్బా.. అను నీ అందాలకు కుర్రకారు ఫిదా..
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
బుధవారం అర్ధరాత్రి పెద్దలకు కర్మకాండ (తూం) పూజ నిర్వహించారు. నాగోబా మహాపూజ, సంప్రదాయ పూజల నిమిత్తం సిరికొండ మండలంలో తయారు చేసిన మట్టి కుండలు ఆలయానికి చేరుకున్నాయి. ఇవాళ (శుక్రవారం) అర్ధరాత్రి నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేసిన అనంతరం జాతర ప్రారంభమవుతుంది. అనంతరం కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు పూజలు చేయనున్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా జాతరకు తరలివస్తారు. 12న దర్బార్ నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు. మెస్రం ప్రజలు మెస్రం మట్టిని తయారు చేయడంలో ఆచరిస్తారు. మహాపూజ తర్వాత రాత్రి 1 గంట తర్వాత భేటింగ్ (కొత్త వధువుల పరిచయం) నిర్వహిస్తారు. ఇప్పటి వరకు నాగోబా ఆలయానికి రాని మెస్రం వంశానికి చెందిన కోడలు సతీదేవి ఆలయంలో కలసిన తర్వాత తెల్లని దుస్తులు ధరించి పూజలు చేస్తున్నారు. ఆ తర్వాత పెద్దల ఆశీస్సులతో పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లు భావిస్తారు. మరుసటి రోజు పెర్సెపెస్, బంపేస్, మందగజిలిపూజ మరియు బేతాళ పూజ నిర్వహిస్తారు.
IPL 2024: ప్రతి జట్టు ఆటగాళ్లకు ఐపీఎల్ 2024 ఏంతో కీలకం!
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!