తెలంగాణ ఇంటర్ పరీక్షల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం నాడు హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉండగా ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని హైకోర్టు పిటిషన్ దారులను ప్రశ్నించింది. చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షలను ఆపలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని…
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రమంగా జడ్జీల నియామకంపై ఫోకస్ పెట్టారు.. సుప్రీంకోర్టు నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టుల వరకు జడ్జీల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.. తాజాగా. తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జీలను నియమించారు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసిన ఏడుగురిని తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జుడిషియల్ ఆఫీసర్లయిన శ్రీసుధా, సి. సుమలత, జి. రాధా రాణి, ఎం. లక్ష్మణ్,…
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు.. ఇవాళ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సతీష్చంద్రచే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు… కాగా, దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 16న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు…
తెలంగాణ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారానికి గురైన బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. పిండం హక్కుల కంటే.. అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అత్యాచారానికి గురైన బాలిక అబార్షన్కు హైకోర్టు అంగీకరించింది. 26 వారాల పిండాన్ని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్కు హైకోర్టు ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీచేసింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి ఈ కీలక…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి.. ఎదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అయితే.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల పై హైకోర్టులో పిల్ దాఖలైంది. సిద్ధిపేట జిల్లా తుక్కాపూర్ కు చెందిన శ్రీనివాస రెడ్డి పిల్ దాఖలు చేశారు. మూడో టీఎంసీకి అనుమతుల్లేకుండా పనులు చేపట్టారని పిల్ పేర్కొన్నాడు పిటిషనర్ శ్రీనివాస రెడ్డి. కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా…
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ఇవాళ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్కెట్ మూసివేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మార్కెట్ను బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నారు. అయితే.. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై హైకోర్టును ఆశ్రయించారు పండ్ల వ్యాపారులు.. ఈ నెల 25 నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో కోర్టు మెట్లెక్కారు.. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసే వరకు బాట సింగారంలో…
గణేశ్ ఉత్సవాల నిర్వాహణపై తెలంగాణ హై కోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం పై ఆంక్షలు హైకోర్టు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తమ ఆంక్షలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని… హుస్సేన్సాగర్లో ట్యాంక్బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. హుస్సేన్సాగర్లో ప్రత్యేకంగా…
విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేసారు ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ. ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకూ ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదన్నారు పిటిషనర్. ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. పిల్ పై ఈ నెల 31న విచారణ చేపట్టనున్నారు తాత్కాలిక సీజే జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం. అయితే కరోనా…
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో.. హైకోర్టు సీజే పోస్టు ఖాళీ ఏర్పడింది.. దీంతో.. ఎంఎస్ రామచంద్రరావును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర న్యాయశాఖ. తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయిలో కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చే వరకు.. బాధ్యతలు నిర్వహించనున్నారు ఎంఎస్ రామచంద్రరావు. కాగా, సుప్రీంకోర్టుకు కొత్తగా 9…
ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. ఓ కేసుకు సంబంధించి అటవీ శాఖ ఉన్నతాధికారులతో పాటు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు విధించిన శిక్ష కేసుకు సంబంధించి అప్పీల్ కు అనుమతి ఇస్తూ, కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను హై కోర్టు కొట్టి వేసింది. సింగిల్ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులపై అధికారులు అప్పీల్ చేసుకునేందుకు చీఫ్ జస్టిస్ తో కూడిన ద్వి సభ్య బెంచ్ అనుమతించింది. 2009 కి చెందిన ఓ కేసులో కోర్టు…