జమునా హేచరీస్ భూముల విషయంలో ఈటెల రాజేందర్ ఊరట లభించింది. గతంలో.. జమునా హేచరీస్ స్వాధీనంలో ఉన్న భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16న జరుపుతామని తెలిపింది.అయితే.. ఈ పిటిషన్లో భూములను కేటాయించిన అసైనీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లయిన జమునా హేచరీస్, ఈటల కుమారుడు నితిన్రెడ్డిలను ఆదేశించింది. read also: Nokia 4210 4G: మార్కెట్లోకి…
తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య మరింత పెరగనుంది.. రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయవాదులను జడ్జీలుగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ వేదికగా జరిగన ఈ కార్యక్రమంలో నేడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. తెలంగాణ హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పాటు…
తెలంగాణ హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 779 అదనపు పోస్టులకు మంజూరు ఇస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన పోస్టుల్లో రిజిస్ట్రార్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) 1, జాయింట్ రిజిస్ట్రార్ 3, డిప్యూటీ రిజిస్ట్రార్ 5, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 4, సెక్షన్ ఆఫీసర్స్/స్క్రూటినీ ఆఫీసర్స్ 96, కోర్టు మాస్టర్స్/పీఎస్ టు జడ్జెస్ 59, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్స్/ట్రాన్స్లేటర్ 78, కంప్యూటర్ ఆపరేటర్ 12,…
తెలంగాణ హైకోర్టుకు మరో 10 మంది న్యాయమూర్తులు రానున్నారు. కొత్తగా పది జడ్జీలను నియమిస్తూ… రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం… తెలంగాణ హైకోర్టుకు 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేసింది. న్యాయవాదుల నుంచి ఏడుగురిని, జ్యుడిషియల్ ఆఫీసర్ల నుంచి ఐదుగురిని జడ్జిలుగా నియమించడానికి కొలీజియం నిర్ణయం తీసుకుంది. Read Also: Fuel Prices Hiked: వరుసగా రెండోరోజూ పెట్రో మంట.. కొత్త…
టాలీవుడ్కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటి భీమిరెడ్డి శ్రీసుధతో గతంలో అతడు సహజీవనం చేయగా ఆ వ్యవహారం వివాదాస్పదమైంది. తనతో శ్యామ్ కె నాయుడు పెళ్లి పేరుతో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని శ్రీసుధ హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా, శ్యామ్ కె నాయుడుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. Read Also: లతా…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో మహమ్మారి వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై డీహెచ్ శ్రీనివాసరావు న్యాయస్థానికి నివేదిక సమర్పించారు. ఇదిలా వుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తుందని మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫీవర్ సర్వేలో 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర హై కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 పై తాము స్టే ఇవ్వలేమని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే ఒకసారి తెలంగాణ హై కోర్టు జీవో నెంబర్ 317 పై ఇలాగే స్పందించింది. తాజాగా ఈ రోజు కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయిపుల పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఈ విధంగా…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో RT-PCR పరీక్షలు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష టెస్టులు చేయాలని సూచించింది. RT-PCR, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు…