కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం మళ్ళీ పరీక్షలకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది ఇంటర్ విద్య జే.ఏ.సి.
కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తూ, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే సిద్ధం కాగా, సోమవారం నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్ట్ నిర్ణయాన్ని విద్యార్థుల తల్లితండ్రులు స్వాగతిస్తున్నారు అని జేఏసీ తెలిపింది.
గుర్తింపు కోసం తాపత్రయ పడే వారి చర్యలను ఇంటర్ విద్యార్థుల తల్లితండ్రులు నిరసిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం కొందరికి చెంపపెట్టు లాంటిదన్నారు. వారి ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ విద్య జేఏసీ పరీక్షల నిర్వహణ బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని పేర్కొంది. అధ్యాపకులందరూ పరీక్షల నిర్వహణ తమ బాధ్యతగా భావించాలని కోరుతున్నామని డా. పి. మధుసూదన్ రెడ్డి, కె. కృష్ణ కుమార్ ప్రకటనలో కోరారు.