TS Assembly KRMB Issue: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీ బోర్డుకు అప్పగించరాదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
Assembly Budget Session: సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై నేడు చర్చ ప్రారంభం కానుంది.
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు. ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగుతుంది.
బడ్జెట్ అన్ని వర్గాల వారిని నిరాశ పరిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వాగ్దాన భంగంకు బడ్జెట్ అద్దం పడుతుందన్నారు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా బడ్జెట్ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై హరీశ్రావు మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో రూ. 2.75 లక్షల కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..
నేటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై ప్రజలలో ఆసక్తి నెలకొంది.
ఎస్ఎల్బీసీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పదేళ్లలో కిలోమీటర్ తవ్వారని ఇటీవల ప్రెస్మీట్లో రేవంత్ చెప్పారని.. కానీ తమ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వామని తెలిపారు. తాము విమర్శలు చేయాలంటే చాలా చేస్తాం.. కానీ మైక్ కట్ అవుతుందని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజు ఏపీ పోలీసులు అన్యాయంగా వచ్చారన్నారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్లో, నాగార్జున సాగర్ తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుందని... కానీ…
ఒక విజన్ లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచింది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏ చేస్తుందొ గవర్నర్ ప్రసంగంలో ఉండాలన్నారు. ఆసరా పెన్షన్ , మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తామో తెలపనీ ప్రసంగం నిరాశ పరిచింది..
హరీశ్ రావు బీఏసీ సమావేశానికి రావడంతో మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పీకర్ దృష్టికి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. లెటర్ కేసీఆర్ నుంచి రావాలి కదా.. లెటర్ ఇవ్వకుండా అనుమతి ఇచ్చేది లేదు..ఈ ప్రతిపాదనకు తాము అంగీకరించలేదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.