మాన్సాస్ ట్రస్టుకూ, సింహాచలం దేవస్థానానికి చైర్మన్గా టిడిపి మాజీ మంత్రి అశోక్గజపతి రాజు స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచైతను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిని మళ్లీ నియమించాలని ఆదేశించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు తమకింకా అందలేదని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. మరోవైపున తెలుగుదేశం నాయకులు ఇది ప్రజాస్వామ్య విజయమనీ, ప్రభుత్వానికి చెంపపెట్టు అని…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ఎస్కూ, శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో చేరతారని వార్తలు వచ్చినా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఈ చేరికకు ఆధ్వర్యం వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బిజెపి ఇన్చార్జి తరుణ్చుగ్ తదితరులతో కలసి తర్వాత నడ్డాను కలిసి ఆ లోటు భర్తీ చేసుకోవలసి వచ్చింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ ఎంపీ…
కేంద్రం పంజరంలో చిలుకగా పేరు మోసిన సిబిఐ డైరెక్టర్ ఎంపిక భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్విరమణ జోక్యంతో కొత్త మలుపు తిరగడం కీలక పరిణామం. సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు,సిజెఐ సభ్యులుగా వుంటారు. కేంద్ర క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది గనక ఈ కమిటీ చర్చలు లాంఛనంగానే పరిగణించబడేవి. ఈసారి బిఎస్ఎప్ డైరెక్టర్గా వున్న రాకేశ్ ఆస్తానా, ఎన్ఐఎ బాస్ వైసిమోడీ పేర్లు తుది జాబితా నుంచి ఎగిరిపోయాయి. రాకేశ్ ఆస్తానాను ప్రధాని…
కేరళలో పినరాయి విజయన్ నాయకత్వాన ఎల్డిఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసింది. నలభై ఏళ్లలో తొలిసారి అక్కడ ఒక ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడం చారిత్రాత్మక విజయంగా పరిగణిస్తున్నారు. 1957లో ఇంఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాతన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచీ తర్వాత ఎల్డిఎఫ్ ప్రభుత్వావరకూ ఏదీ మళ్లీ గెలిచిందిలేదు.1982 నుంచి ఎల్డిఎఫ్ యుడిఎఫ్ ఒకదాని తర్వాత ఒకటి గెలవడమే జరుగుతూ వస్తున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఎల్డిఎఫ్ ఒక స్థానం తప్ప…
ఎంపి రఘురామకృష్ణంరాజు అరెస్టు వివాదం ఇప్పుడు పూర్తిగా సుప్రీం కోర్టు చేతుల్లోకి వెళ్లిపోవడం వూహించిన పరిణామమే. ఆయనను ఎపి సిఐడి పోలీసులు దర్యాప్తు సందర్భంలో కొట్టారో లేదో తేల్చడానికి సికిందరాబాదులోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని అత్యున్నత న్యాయస్తానం ఆదేశించింది. తాను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆయనను అక్కడే కొనసాగించాలని కూడా స్పష్టం చేసింది. ఈ వైద్య పరీక్షల ఖర్చు ఎంపినే భరించాలని కూడా చెప్పడం కొసమెరుపు. ఏమైనా ఇప్పుడు అరెస్టును మించి ఆయనను కొట్టారా లేదా అన్నది…
ఇటీవలి కాలంలో ఏపిలో టిడిపి నేత అరెస్టు,కేసు చూస్తున్న వారికి ఎంపి రఘురామకృష్ణం రాజు అరెస్టు అట్టే ఆశ్చర్యం కలిగించదు. కాకపోతే వారు ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు కాగా ఈయన పాటక వైసీపీ టికెట్ పైనే ఎంపికైన ఎంపి. కారణాలేమైనా చాలా కాలంగా ఆయన అధినేతతో విభేదించి వివాదగ్రస్తమైన వ్యాఖ్యలు కొససాగిస్తున్నారు. దీనిపై ఆయనను అనర్హుడిగా ప్రకటించాని వైసీపీ పార్లమెంటరీ పార్టీ లోక్సభ స్పీకర్ను కోరింది. అయితే తాము పార్టీ పక్షాన చర్యలు తీసుకోవడానికి మాత్రం…
అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మరోసారి దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా సమీక్ష ప్రారంభించింది. తాత్కాలిక అద్యక్షురాలు సోనియా గాంధీ ఆద్యక్షతన జరిగిన వర్కింగ్ కమిటీ వర్చువల్ సమావేశం మొక్కుబడిగా తప్ప లోతుగా పరిశీలన జరిపిందా అంటే లేదనే చెప్పాలి. ఈ ఎన్నికలో తమ పార్టీకి వచ్చిన పలితాలు చాలా నిరుత్సాహకరంగా వున్నాయని సోనియాగాంధీ వ్యాఖ్యానించడం మినహా మరే విధమైన ఆత్మ విమర్శ కనిపించలేదు. కేరళలో అస్సాంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కోరుకున్నది. పశ్చిమ బెంగాల్లో వామపక్షంతో…
పంచతంత్రంలో పారని మోడీ తంత్రం అని ఎన్టివితొగులో చెప్పుకున్నదాన్ని ఎగ్జిట్పోల్స్ ఫలితాలు ధృవపరుస్తున్నాయి.వారు పాలిస్తున్న అసోం మినహా తక్కిన మూడు ప్రధాన రాష్ట్రాలోనూ బిజెపి అధికారంలోకి రాకపోవచ్చని ఎక్కువ సంస్థల ఎగ్జిట్ పోల్స్చెబుతున్నాయి. హోరాహోరీగా జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలో బిజెపి అధికారంలోకి రాకపోవచ్చని అత్యధిక పోల్స్ సూచిస్తున్నాయి. గతంలోని 211 స్థానాల నుంచి 150కి అటూ ఇటూగా తగ్గినా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ రావచ్చుననే చెబుతున్నాయి. రిపబ్లిక్ టీవీ పోల్స్లో బిజెపి…
ఎపి ముఖ్యమంత్రి తల నరుకుతానంటూ వ్యాఖ్యానించిన సస్పెండెడ్ మేజిస్ట్రీట్ రామకృష్ణను మదనపల్లిలో పోలీసు అరెస్టు చేసి, పీలేరు తీసుకువెళ్లారు. అధికారిక ప్రకటన ఇంకా లేనప్పటికీ ఆ వ్యాఖ్యల కోసమే అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుమీద కాల్చాలని జగన్ అనలేదా అని ఈ సమయంలో రామకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే ఆ సమయంలోనూ జగన్ ను అందరూ ఖండిరచారనేది తెలిసిన విషయమే. ఆయన కూడా తన వ్యాఖ్యలను కొంచెం…
విన్నావా ఆరుద్రా తమాషా సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా అన్నాడు శ్రీశ్రీ ఒక చోట. నిజంగానే సంప్రదాయాలు విశ్వాసాలు తరతరాలు కొనసాగుతుంటాయి. అయితే వాటి రూపం మారిపోతుంటుంది. అంతేగాక భిన్నమైన సంప్రదాయాలు సంసృతులు విశ్వాసంగా సువిశాల భారత దేశంలో ఈ క్రమంలో మరింత సాగుతుంటుంది. ఒక్కొక్క కుటుంబంలోనూ లేదా సమాజంలో వచ్చే ఈ మార్పు మొత్తం స్వరూపం అందరూ చేసుకునే పండుగలు పబ్బాలు సమయంలో మరింత ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే` తెలుగువారి తొలి పండుగ,…