తెలంగాణముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రకటన కన్నా బాగా ముందే సర్వతోముఖ వ్యూహాలకు పదును పెడుతున్న తీరు ప్రత్యర్థులను తికమకపెట్టే స్థాయిలో నడుస్తోంది.ఒకటి రెండు ఎదురుడెబ్బలు, కరోనా కారణంగా ఒకింత విరామం తీసుకున్న ఆయన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నాటినుంచే జోరు పెంచారు. ఈటెల రాజేందర్ ఉద్వాసన ఆ వెంటనే ఎదురు దాడితో దాన్ని ఉధృతంచేశారు. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్, ఆయనతో చేరిన ఈటెల రాజేందర్లకు తోడు పిసిసి అద్యక్షుడుగా వచ్చిన రేవంత్రెడ్డి కూడా…
ఆర్ఆర్ఆర్ అనబడే రౌద్రం రుధిరం రణం చిత్రంలోని దోస్తీ పాటను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి నిర్దేశంలో గాయకుడు హేమచంద్ర పాడిన సీతారామశాస్త్రి పాట చిత్రంలో చిత్రణ అలా వుంచితే విడుదలచేసిన ట్రైలర్లో కూడా ఉద్వేగభరితంగా వుంది. గిరిజనులను కదిలించి పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ల మధ్య వూహాజనిత స్నేహం దాని పరిణామం చిత్రకథ గనక స్నేహగీతం విడుదల చేయడం కూడా సముచితమే. పులికి విలుకానికి,తలకూ వురితాడుకూ కదిలే కార్చిచ్చుకు కసిరే…
పెగాసస్ స్పైవైర్పై పోరాటం అంతకంతకూ తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.లోక్సభ రాజ్యసభ రెండుచోట్లా తమ వాయిదా తీర్మానాలను నోటీసులను తోసిపుచ్చడం ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా తమ ఒత్తిడిని బేఖాతరు చేయడమే గాక ఇదే అదనుగా కీలకమైన బిల్లులను ఆమోదింపచేసుకోవడం వాటికి మరింత అసహనం కలిగిస్తున్నది. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను నిబంధనలను పాతర వేయడమేనని సభ్యులు విమర్శిస్తున్నారు.ఈ రోజు కూడా లోక్సభలో కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారి, రాజ్యసభలో సిపిఎం సభ్యుడు ఎలగారం కరీం…
పార్లమెంటు సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్ స్పైవేర్తో వందలమంది మొబైళ్లను అక్రమంగా ఆలకించారన్న ఘోరం బయిటకు వచ్చింది. రహస్యంగా వినడానికే గాక రహస్య చిత్రాలు తీయడానికీ ఇది ఉపకరిస్తుంది. మన దేశంలో వైర్తో సహా ప్రపంచ వ్యాపితంగా పదిహేను దేశాల మీడియా సంస్థలు ఈ కథనాన్ని సాక్ష్యాధారాలతో సహా వెల్లడి చేశాయి.ఇజ్రాయిల్కు చెందిస స్పైవేర్ తయారీదారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూపుచెప్పిన ప్రకారం దాన్ని ప్రభుత్వాలకే విక్రయిస్తారు.ఈ మాట మోడీ ప్రభుత్వమూకాదనలేదు. అనధికారికంగా హ్యాకింగ్ కుదిరేపని కాదంటున్నది.…
ఇరవైరోజుల నాటకీయ పరిణామాల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా యొడ్యూరప్ప రాజీనామా చేయడం, ఆస్థానంలో బసవరాజ్ బొమ్ముయ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిపోయాయి. బొమ్మయ్ గతంలో జనతాదళ్ ముఖ్యమంత్రిగా ఆపార్టీ జాతీయ అద్యక్షుడుగా పనిచేసిన ఎస్ఆర్బొమ్మయ్ కుమారుడు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బొమ్మయ్ని తొలగించినప్పుడు కోర్లు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోయింది. పాత చరిత్ర అలా వుంచితే బసవరాజ్ యొడ్యూరప్ప మంత్రివర్గంలో హోంశాఖ నిర్వహించారు. ఆయనకు విశ్వాసపాత్రుడు.అంతేగాక యెడ్యూరప్పలాగే లింగాయత్ వర్గానికి చెందిన వారు. ఆయన సలహామేరకే బసవరాజ్…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శరద్పవార్తో,గాంధీ కుటుంబంతో జరుపుతున్న మంతనాలు,ప్రతిపక్ష నేతల సమావేశం,రేపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢల్లీి పర్యటన వంటి అంశాలు ఇప్పుడుమీడియాలో ప్రముఖ స్థానం ఆక్రమిస్తున్నాయి.ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి ఎన్డిఎ కూటమికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారనేది ఒక అభిప్రాయం. అందుకు సంబంధించిన సంప్రదింపులలో కాంగ్రెస్ మొదట పాల్గొనకపోవడంపై వ్యాఖ్యలు వచ్చాక ఆయన నేరుగా సోనియా రాహుల్ తదితరులతో చర్చలు జరిపివచ్చారు. ఇప్పుడు మమతా…
మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏవో సంచలన పరిణామాలు వచ్చినట్టు, కొత్తమలుపులు తిరుగుతున్నట్టు కథనాలు మార్మోగుతున్నాయి. ఆయన వాచ్మ్యాన్ రంగయ్య సిబిఐ దర్యాప్తు తర్వాత మేజిస్ట్రీట్ముందు ఇచ్చిన వాంగ్మూలంలో మూడుపేర్లు చెప్పడం ఇందుకు కారణమవుతున్నది. తర్వాత ఆయన మీడియాతోనూ మాట్లాడారు. ఆయన చెప్పిన పేర్లలో ప్రధానంగా వినిపిస్తున్న ఎర్రగంగిరెడ్డి తనకు హత్యతో సంబంధం లేదని అంటుండగా మరోపేరు సునీల్ రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నాడు ఈ హడావుడి మొదలవడానికి ముందు హత్యకేసు దర్యాప్తు…
కోవిడ్ మూడోవేవ్ గురించిన భయాందోళనలు ఒకవైపున వెంటాడుతుండగా రెండవ వేవ్లో మరణాల సంఖ్య తక్కువగా బయిటకువచ్చిందనే ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.దేశంలో పాలకుల పోకడలకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది, ఎందుకంటే మరణాల సంఖ్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలదే తప్పుఅన్నట్టు కేంద్రం మాట్లాడుతున్నది.దేశంలో నమోదైన కోవిడ్ మరణాలసంఖ్యకు వాస్తవంగా సంభవించిన వాటికి చాలా తేడావున్నట్టు అంతర్జాతీయంగానూదేశంలోనూ కూడా కథనాలు వచ్చాయి. ప్రధాని మోడికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రహ్మణ్యం బృందంనుంచి…
ఎపి రాజధాని అమరావతిలో భూముల ఇన్సైడర్ ట్రేడిరడ్ కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఒక దీర్ఘకాలిక వ్యాజ్యానికి ఫుల్స్టాప్ పడినట్టే , అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గనక దీనిపై ఇక ఎలాటి న్యాయపోరాటానికి ఆస్కారంవుండదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా వున్నప్పటి నుంచి రాజధాని భూములను టిడిపి పెద్దలు మంత్రులు వారికి కావలసినవారు ముందస్తు సమాచారంతో కొనేసి రైతులకు నష్టం కలిగించారనే ఆరోపణ చేస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే ఇన్సైడర్ ట్రేడిరగ్ అనే స్టాక్…
ఎపి తెలంగాణల మధ్య ఎడతెగని వివాదంగా మారిన నదీజలాల సమస్యకు పరిష్కారంగా కృష్ణా గోదావరి నదులపై వున్న ప్రాజెక్టులను పూర్తిగా తన అదుపులోకి తీసుకుంటూ కేంద్ర జలశక్తిశాఖ నోటిఫికేషన్ ముసాయిదా విడుదల చేసింది. కృష్ణా గోదావరి నదీజలాల నిర్వహణ సంఘాల పరిధినిప్రకటించింది. దీని అమలు కోసం ఇరు రాష్ట్రాలు చెరి 200 కోట్ల చొప్పున చెల్లించాలనీ, అక్టోబర్నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేకించగా ఎపి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. వాస్తవంలో…