Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Telakapalli Ravi Analysis On Kerala New Government

తెలకపల్లి రవి : పినరాయి కొత్త ప్రభుత్వం, మొత్తం పాత మంత్రుల మార్పు

Published Date :May 22, 2021 , 8:39 pm
By Lakshmi Narayana
తెలకపల్లి రవి : పినరాయి కొత్త ప్రభుత్వం, మొత్తం పాత మంత్రుల మార్పు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేరళలో పినరాయి విజయన్‌ నాయకత్వాన ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసింది. నలభై ఏళ్లలో తొలిసారి అక్కడ ఒక ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడం చారిత్రాత్మక విజయంగా పరిగణిస్తున్నారు. 1957లో ఇంఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వాతన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచీ తర్వాత ఎల్‌డిఎఫ్ ప్రభుత్వావరకూ ఏదీ మళ్లీ గెలిచిందిలేదు.1982 నుంచి ఎల్‌డిఎఫ్‌ యుడిఎఫ్‌ ఒకదాని తర్వాత ఒకటి గెలవడమే జరుగుతూ వస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఎల్‌డిఎఫ్ ఒక స్థానం తప్ప అన్నీ కోల్పోయింది. దానికి ముందు తర్వాత తుపాన్లు, శబరిమలై వివాదం నుంచి సిబిఐ ఐఎన్‌ఎ దాకా పినరాయి ప్రభుత్వానికి పెనుసవాళ్లుగా మారాయి. కోవిడ్‌19 ను ఎదుర్కోవసి వచ్చింది. రాజకీయంగా పాలనా పరంగా సమర్థవంతమైన కృషితో వీటిని జయప్రదంగా అధిగమించి ఆ ప్రభుత్వం మరోసారి ప్రజల విశ్వాసం పొందింది.

గత దశాబ్ది వరకూ వామపక్షాలకు కంచుకోటగా వున్న పశ్చిమ బెంగాల్‌లో సిపిఎంకు ఒక్క స్థానం కూడా రాని ప్రతికూల పరిస్తితుల్లో కేరళ విజయం వామపక్షాల మనోధృతిని నిలబెట్టింది. ముఖ్యమంత్రి తప్ప పూర్తిగా కొత్తవారినే మంత్రివర్గంలో చోటు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు 11 కొత్త వారు మంత్రులుగా నియమితులయ్యారు. సిపిఐ మంత్రులు నలుగురూ కొత్తవారే బాధ్యతలు తీసుకున్నారు. 20వ తేదీన ప్రమాణస్వీకారం 500 మందితో నిరాడంబరంగా జరిగింది. వివిధ మతాల తరగతుల ప్రతినిధులు కూడా ఆ వేడుకలో పాల్గొనడం కేరళ సామాజిక స్వరూపాన్ని ప్రతిబింబించింది. ముమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి అగ్రతారలు ఈ విజయాన్నిమనసారా ఆభినందించడమే గాక కొత్త ప్రభుత్వం కేరళను అభివృద్థి పథంలో మరింత ముందుకు తీసుకుపోగదనే విశ్వాసం ప్రకటించారు.

అయిత మీడియాలో కొంతమంది వ్యాఖ్యాతలకు గత ప్రభుత్వంలో వైద్యశాఖ మంత్రిగా వున్న కె.కె.శైలజను మళ్లీ తీసుకోకపోవడమే ఏకైక ఎజెండాగా మారింది. కరోనాపై జరిగిన పోరాటంలో నిరోధంలో శైలజ టీచర్‌ సమర్థంగా పనిచేసి అంతర్జాతీయంగానే అభినందలను పొందిన మాట నిజమే. అయితే ఆమెను కావాలని తప్పించినట్టు చేసే వ్యాఖ్యానాలు పూర్తిగా అవాస్తవికమైనవే గాక నిరాధారమైనవి. ఆమెతో పాటు గత మంత్రివర్గంలో వున్న టి.రామకృష్ణన్‌, పి.రామకృష్ణన్‌, ఎంఎం మణి, కడంపల్లిసుధీరన్‌, సి.రవీంద్రనాథ్‌, ఎ సిమొయిద్దీన్‌ లు కూడా ఈ కొత్త ప్రభుత్వంలో లేరు. దేశమంతటికీ తెలిసిన ఆర్థిక మంత్రి థామస్‌ ఐసాక్‌, ఇపి జయరాజన్‌ వంటివారు ఎన్నికలలోనే పోటీ చేయలేదు.

ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో గెలిచిన వారు మళ్లీ పోటీ చేయడం వద్దన్న సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం దీనికి కారణమైంది. అదే విధంగా మంత్రివర్గంలో పూర్తిగా కొత్తవారిని తీసుకోవాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందరూ కొత్తవారైతే ముఖ్యమంత్రి పినరాయి వ్యక్తిగత ప్రాబల్యం పెరిగిపోతుందనే విశ్లేషణలు వూహాగానాలే అవుతాయి. ఎందుకంటే కొత్తగా మంత్రులైన వారెవరూ సిపిఎం పార్టీకి రాజకీయాలకు కొత్తవారు కాదు. దీర్గకాలంగా వున్న వారే. బాలగోపాల్‌ రాజీవ్‌ రాజేశ్‌ వీణా జార్జి బిందు వంటి వారంతా ప్రజాజీవితంలోనూ ఉద్యమంలోనూ సేవలందించిన వారే. సంస్తాగతంగానూ ప్రజాప్రతినిధులుగానూ సమర్థత నిరూపించుకున్నవారే.

కెకె శైలజ కూడా ఈ నిర్ణయంపై స్పందన అడిగినపుడు గతసారి మంత్రినైనప్పుడు నేను కొత్తదాన్నే కదా అని చక్కటి సమాధానమిచ్చారు. వీరిలో అత్యధికులు యువత కావడం స్వాగతించదగిన విషయం. సిపిఎంలో యువత లేదనీ పాతవారి మాటే చెల్లుతుందని ప్రచారం చేసేవారే కేరళ కమిటీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవానికి మేయర్లుగా చిన్నవారిని ఎంపిక చేయడంతోనే ఈ ప్రక్రియ మొదలైంది,పార్టీలో పాలనలో సమాజంలో తరాల మార్పును క్రమబద్దంగా ప్రోత్సహించడం ఒక బాధ్యతా యుత కర్తవ్యం. కేవలం కెకెశైలజను మళ్లీ మంత్రిగా తీసుకోకపోవడం పెద్ద రాజకీయ మార్పు కాబోదు. అప్పుడూ ఇప్పుడూ ఆమె సమిష్టి నిర్ణయాలో భాగస్వామిగానే వుంటారు. ఆమె సహాయాలు తీసుకుంటానని కొత్తమంత్రి వీణాజార్జి చెప్పారు కూడా.

ఆమెకు మాత్రమే మినహాయింపు ఇవ్వడమంటే అప్పటి ఇతర సహచరుల సంగతేమిటి? అందుకే అలా చేయలేకపోయామని పినరాయి సూటిగానే వివరించారు. నిజానికి కేరళ మీడియాలో కొందరు గౌరి అమ్మ మరణించిన నాటినుంచే ఈ మీమాంసలేవదీశారు. సీనియర్‌ నాయకురాలైన గౌరీ అమ్మ ఒక దశలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడినందుకు తొలగించినా ఆమె యుడిఎఫ్‌లో మంత్రిగా చేసినా ఆఖరి దశలో ఆ శక్తులతో విడగొట్టుకుని పాత వరవడికి దగ్గరయ్యారు. కేవలం మహిళ అనే కోణంలో గౌరియమ్మ వ్యవహారానికి ఇప్పటి మంత్రివర్గంలో శైలజ లేకపోవడానికి పోలిక తేవడంలో అర్థం లేదు. శశిథరూర్‌ మురళీధరన్‌ వంటి కాంగ్రెస్‌ నేతలకు శైలజ టీచర్‌పై ఎక్కడలేని అభిమానం పుట్టుకొచ్చింది గానీ గతంలో వారు ఆమెను విమర్శించిన వారేనని పినరాయి అన్నారు. శైలజ విషయంలో కేంద్ర నాయకత్వం కూడా అసంతృప్తిగా వుందని కథనాలు రాగా ఇవన్నీ రాష్ట్ర కమిటీలే నిర్ణయించుకుంటాయని ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమాధానమిచ్చారు.

ఒకప్పుడు అచ్యుతానందన్‌, పినరాయి విజయన్‌ మధ్య విభేదాలతో సిపిఎం ముక్కలై పోతుందని జరిగిన ప్రచారం వినిపించిన జోస్యాలు నిజం కాలేదు. కాంగ్రెస్‌ బిజెపి లేదా ప్రాంతీయ పార్టీలో వల్లే సిపిఎంలో ఏ ఒక్కరో నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. కాని కేరళలో ఎల్‌డిఎఫ్‌ మలి విజయం ముందు నుంచే వారి దాడి పినరాయిపై కేంద్రీకృతమైంది. ఇప్పుడు మళ్లీ పినరాయి మోడీ ఇన్‌ మండు(పంచెలో మోడీ) అని ఆయన ఆధిపత్యమే సాగుతున్నదని ప్రచారం నడుస్తున్నది. అయితే సిపిఎం కేంద్ర కమిటీ పత్రిక పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం ఈ ప్రచారాలను స్పష్టంగా తోసిపుచ్చింది. నాయకుడుగా ఆయనపాత్ర కీకమని చెబుతూనే సమిష్టి విజయంగా కేరళ తీర్పును అభివర్ణించింది. గతంనుంచి డివైఎఫ్‌ఐ అద్యక్షుడుగా వున్న రియాజ్‌ మంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి అల్లుడు కావడం గురించే మళయాల మీడియా రాసింది. ఆరెస్సెస్‌ వాదులైతే మరో అడుగు ముందుకేసి ఇస్లామిక్‌శక్తులకు ప్రభుత్వంలో చోటు కల్పించినట్టు ఆరోపణలు చేశారు. ఇవన్నీ ఎల్‌డిఎఫ్‌ చారత్రిక విజయం నుంచి దృష్టి మరల్చే దుష్టయత్నాలేనని విజయన్‌ కొట్టిపారేశారు. మరి ఆచరణలో ఆయన ప్రభుత్వం వీటికి ఎలాంటి సమాధానమిచ్చేది చూడవలసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kerala
  • new government
  • pinarai vijayan
  • telakapalli ravi
  • telakapalli Ravi analysis

తాజావార్తలు

  • TTD Server Issue: టీటీడీ సర్వర్‌లో సాంకేతిక లోపం.. ఆన్‌లైన్‌ టికెట్ల జారీ రద్దు..

  • JD Vance: ఇస్లామాబాద్‌లో వింత మర్యాద.. చిన్నారితో జేడీ వాన్స్‌కు స్వాగతం

  • KCR: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ బహిరంగసభ..

  • Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!

  • Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions