Railways Ticket Cancellation Rules: టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత కట్..? కొత్త వివరాలు వెల్లడించిన రైల్వే మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railways Ticket Cancellation Rules: టికెట్ రద్దులు, వెయిటింగ్ లిస్ట్ టికెట్ల ద్వారా భారతీయ రైల్వే ఎంత ఆదాయం పొందుతుందనే అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలు వెల్లడించారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, టికెట్ రద్దు ఛార్జీలు లేదా రద్దు చేయని వెయిటింగ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి జోన్ల వారీగా భారతీయ రైల్వే ఎలాంటి ప్రత్యేక రికార్డులను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ చంద్రకాంత్ హండోరే అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. గత మూడు సంవత్సరాల్లో టికెట్ రద్దు రుసుములు, వెయిటింగ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయంపై సమాచారం కోరగా, అలాంటి గణాంకాలు జోన్ల వారీగా నమోదు చేయడం లేదని తెలిపారు.
టికెట్ రద్దు నిబంధనల విషయానికొస్తే, సాధారణ రైళ్లలో ప్రయాణానికి 48 గంటల ముందే టికెట్ రద్దు చేస్తే క్లాస్ను బట్టి రూ.240 నుంచి రూ.60 వరకు రద్దు రుసుము వసూలు చేస్తారు. 48 గంటల నుంచి 12 గంటల మధ్య రద్దు చేస్తే టికెట్ ధరలో 25 శాతం, 12 నుంచి 4 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం కోత విధిస్తారు. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఉండదు. ఇక, వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్లను రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు వరకు రద్దు చేసుకోవచ్చు. అనంతరం ప్రతి ప్రయాణికుడికి రూ.60 క్లర్కేజ్ ఛార్జీ విధిస్తారని వెల్లడించారు..
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Punjab: ఆప్లోకి గ్యాంగ్స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
ఇక వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రత్యేక రద్దు నిబంధనలు అమల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ రైళ్లలో నకిలీ లేదా ఊహాజనిత బుకింగ్లను అరికట్టేందుకు ప్రత్యేక రీఫండ్ విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రయాణానికి 72 గంటల ముందు రద్దు చేస్తే 25 శాతం, 72 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం కోత విధిస్తారు. రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వబడదు అని స్పష్టం చేశారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!