Asia Cup 2022: నేటి నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టోర్నీ ప్రారంభం కానుంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా అక్కడి ఆర్ధిక పరిస్థితుల కారణంగా యూఏఈకి షిఫ్ట్ చేశారు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం ఆరు జట్లు.. 13 మ్యాచ్లు.. 16 రోజుల పాటు జరగనున్నాయి.…
Asia Cup 2022: రేపటి నుంచి దుబాయ్లో ఆసియా కప్ సమరం ప్రారంభం కాబోతోంది. టోర్నీలో రెండో రోజే హైఓల్టేజ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు దుబాయ్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో శిక్షణ సెషన్లు నిర్వహిస్తుండగా.. భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు కలుసుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు. ఒకవైపు ఇరుదేశాల అభిమానులు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారా అని టెన్షన్ పడుతుంటే.. భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం…
Irfan Pathan: విస్తారా ఎయిర్లైన్స్పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ముంబై నుంచి దుబాయ్ వెళ్తుండగా విస్తారా సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని ఇర్ఫాన్ పఠాన్ ఆరోపించాడు. ముంబై నుంచి దుబాయ్ వెళ్లేందుకు విస్తారా విమానం యూకే-201లో టిక్కెట్ బుక్ చేసుకున్నానని.. కానీ చెక్ ఇన్ కౌంటర్ వద్ద తనకు చేదు అనుభవం ఎదురైందని పఠాన్ వివరించాడు. తన భార్య, పిల్లలతో దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నానని..…
ICC Rankings: ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పులేకుండా టీమిండియా తన మూడో ర్యాంకును నిలబెట్టుకుంది. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన మూడు వన్డేల సిరీస్ను క్వీన్స్వీప్ చేసిన భారత్ మరో మూడు రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకొని 111 పాయింట్లతో తమ ర్యాంకును మరింత పదిలం చేసుకుంది. మరోవైపు నెదర్లాండ్స్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన పాకిస్థాన్ సైతం ఒక పాయింట్ను పెంచుకుని 107 పాయింట్లతో నాలుగో స్థానంలో…
Shubman Gill: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా 22 ఏళ్ల వయసులోనే విదేశీ గడ్డపై బ్యాక్ టు బ్యాక్ వన్డే సిరీస్లలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన టీమిండియా ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన…
Team India Coach Rahul Dravid Tested Covid Positive:ప్రతిష్టాత్మక ఆసియా కప్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. రేపో.. మాపో టీమిండియా యూఏఈకి బయలుదేరాల్సి ఉండగా.. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ ఐదురోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో టీమిండియా యూఏఈకి ఆలస్యంగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియాకప్ టోర్నీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ కోచ్ ద్రవిడ్కు కరోనా…
Shikar Dhawan: జింబాబ్వేతో మూడో వన్డేలో శార్దూల్ ఠాకూర్ జెర్సీతో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు 42వ నంబర్ జెర్సీ ధరించాల్సిన ధావన్ 54వ నంబర్ జెర్సీ ధరించాడు. అయితే జెర్సీపై శార్దూల్ ఠాకూర్ పేరు కనపడకుండా టేప్ అతికించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓపెనర్గా శార్దూల్ వచ్చాడేమో అని అనుకున్నామని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ప్రపంచంలోనే ధనిక…
India Vs Zimbabwe: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో కూడా టీమిండియానే టాస్ గెలిచింది. ఈ సందర్భంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి ఫీల్డింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపించాడు. తొలివన్డేలో కూడా టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా జింబాబ్వేను 189 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. అదే తరహాలో రెండో వన్డేలో కూడా తక్కువ పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసేలా టీమిండియా ప్రణాళికలు రచించింది. ఇప్పటికే మూడు…
Ind Vs Zim: జింబాబ్వే గడ్డపై ఆ దేశ జట్టుతో టీమిండియా నేడు రెండో వన్డే ఆడనుంది. మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. రెండో వన్డేలోనూ టీమిండియా ఫేవరేట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్కు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైన నేపథ్యంలో ఈ వన్డేలో అతడు ఓపెనింగ్కు వస్తాడా లేదా మిడిలార్డర్లోనే…
Asia Cup 2022: దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడుతుంటే వాళ్ల పోరును అభిమానులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వీక్షిస్తే వచ్చే ఆ మజానే వేరు. ఈనెల 28న ఆసియాకప్లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్థాన్పై టీమిండియానే గెలుస్తుందని జోస్యం చెప్పాడు. అయితే ఇందుకు గల కారణాలను కూడా డానిష్ కనేరియా వివరించాడు. పాకిస్థాన్ కంటే భారత బౌలింగ్ విభాగం…