Team India: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల ఆసియాకప్లో సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. దీంతో మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్లో అందరి కళ్లు కోహ్లీ బ్యాటింగ్పైనే ఉన్నాయి. అయితే తాజాగా నెట్స్లో విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియం పేస్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంతో ఆస్ట్రేలియాతో సిరీస్లో కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తాడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఆసియా కప్లో బౌలింగ్ వైఫల్యంతోనే టీమిండియా టోర్నీ…
T20 World Cup: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో బ్యాట్ పట్టబోతున్నాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ ఓపెనర్గా రాబోతున్నాడు. ఇదంతా నిజమా అని మీరు అనుకోకండి. రాబోయే టీ20 వరల్డ్ కప్లో ఇండియన్ టీమ్లోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఓ టీవీ యాంకర్ న్యూస్ చదువుతూ తడబడ్డాడు. ఇండియన్ టీమ్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నట్లు…
Yuvraj Singh: సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలనం సృష్టించాడు. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై ఆకాశమే హద్దుగా యువరాజ్ చెలరేగిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. పురుషులు టీ20 మ్యాచ్లో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా యువీ రికార్డులకెక్కాడు. అతడి వీర బాదుడుకు బ్రాడ్ బిక్కమొహం వేశాడు. అంతకుముందు ఓవర్లో ఫ్లింటాఫ్తో గొడవ కారణంగా…
Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరెన్ని వాదనలు చేసినా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్వన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యానేనని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వారి ఇష్టమని.. తన అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నాడు. టీ20 ఫార్మాట్లో పాండ్యాకు తిరుగు లేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇటీవల ఆసియా కప్లో…
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్నెస్తో పాటు ట్రెండ్ను కూడా ఫాలో అవుతుంటాడు. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం విరాట్ కోహ్లీ మొహాలీ చేరుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ నెల 20న మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా మొహాలీ ఎయిర్పోర్టులో విరాట్ కోహ్లీ దిగిన ఫొటోలను పీసీఏ తన ట్విటర్లో పంచుకుంది. ఈ ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్లో కనిపించాడు. అతడి కొత్త…
BCCI: వచ్చేనెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అయితే ప్రధాన బౌలర్ షమీని స్టాండ్ బైగా ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది. షమీని ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదని విమర్శకులు బీసీసీఐపై దుమ్మెత్తిపోశారు. తాజాగా షమీని తుది జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాలను బీసీసీఐ సెలక్టర్ వెల్లడించారు. మహమ్మద్ షమీ స్టాండ్బైగా ఉన్నా దాదాపు తుది జట్టులో ఉన్నట్లేనని ఆయన స్పష్టం చేశారు. గాయాలతో…
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త జోష్లో కనిపిస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ఆసియా కప్లో సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఉత్తేజంగా ముందుకు సాగిపోతున్నాడు. మరోవైపు ట్విట్టర్లో 50 మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని అందుకున్నాడు. ట్విట్టర్ వేదికగా పలు యాడ్లను షేర్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నాడు. తాజాగా ఫుమా కంపెనీకి చెందిన ఓ వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. ఈ వీడియోలో ఫుమా కంపెనీ గురించి కాకుండా తన…
Venkatesh Iyer: దులీప్ ట్రోఫీలో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరులో వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ జట్ల మధ్య సెమీఫైనల్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెస్ట్ జోన్ బౌలర్ చింతన్ గజా విసిరిన బంతి వెంకటేశ్ అయ్యర్ మెడపై బలంగా తాకింది. గాయంతో విలవిల్లాడుతూ వెంకటేశ్ అయ్యర్ మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే అంబులెన్స్ వచ్చి అయ్యర్ను మైదానం నుంచి తీసుకెళ్లింది. అయితే గుడ్ న్యూస్…
Robin Uthappa: టీమిండియాకు మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ఈశ్వర్ పాండే రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా మరో సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇండియా, కర్ణాటక తరపున ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 20 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఉతప్ప భారత్ తరపున 46 వన్డేలు, 13 టీ20లు…
Australia: త్వరలో మూడు టీ20ల సిరీస్ కోసం భారత్ రానున్న ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టాయినీస్ జట్టుకు దూరమయ్యారు. ఇటీవల న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాయపడ్డారు. మిచెల్ స్టార్క్ మొకాలి గాయంతో బాధపడుతుండగా.. మిచెల్ మార్ష్ చీల మండ గాయంతో, మార్కస్ స్టాయినీస్ పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే టీ20 ప్రపంచకప్కు ముందు…