MS Dhoni Birthday: భారత సైన్యంలో మంచి పొజిషన్.. ఎంఎస్ ధోనీ ఆర్మీ జర్నీ గురించి తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All about GOAT MS Dhoni’s stint with Indian Territorial Army: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మోస్ట్ సక్సెస్ ఫుల్ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. ధోనీ మంచి క్రికెటర్ మాత్రమే కాకూండా.. ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. బైక్స్ నడపడం, వ్యవసాయం చేయడం కూడా మహీకి మహా ఇష్టం. వీటన్నింటికి కంటే ఎక్కువగా ధోనీ దేశాన్ని ప్రేమిస్తాడు. దేశం పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటాడు. భారత సైన్యంలో అతడికి మంచి పొజిషన్ ఉండడమే ఓ మంచి ఉదాహరణ. నేడు ధోనీ 42వ పుట్టినరోజు సందర్భంగా మహీ ఆర్మీ జర్నీ గురించి ఓసారి చూద్దాం.
2011లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ వన్డే ప్రపంచకప్ అందుకున్న విషయం తెలిసిందే. అందుకు గౌరవంగా భారత సైన్యంలో భాగమైన టెరిటోరియల్ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ పదివిని ఇచ్చి గౌరవించింది. అప్పటినుంచి ధోనీ సమయం దొరికినప్పుడల్లా భారత ఆర్మీకి సంబంధించిన కార్యక్రమాలు, శిక్షణలో పాల్గొంటున్నాడు. 2018లో పద్మభూషణ్తో సత్కరించింది. ఆ సమయంలో ఆర్మీ యూనిఫారంలోనే ధోనీ కార్యక్రమానికి హాజరయి అవార్డును అందుకున్నాడు.
Also Read
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
టెరిటోరియల్ ఆర్మీ తర్వాత 106 ఇన్ఫాంట్రీ బెటాలియన్ టీఏ పారాలో (ఎలైట్ ఫోర్స్) ఎంఎస్ ధోనీ భాగమయ్యాడు. ఇప్పటివరకు ఏ ప్లేయర్ చేయని కఠిన శిక్షణను కూడా ధోనీ తీసుకున్నాడు. 2015 ఆగష్టులో రెండు వారాల కఠోర శిక్షణ అనంతరం ఆగ్రాలో 15,000 అడుగుల ఎత్తు నుంచి పారా జంప్ చేశాడు. ఐదుసార్లు పారా జంప్ చేసిన ధోనీ.. మిగిలిన సైనికులతో పాటు వింగ్స్ (యూనిఫాంలో నీలం రంగు రెక్కలు, పారాచూట్ గుర్తు) అందుకున్నాడు. ఆపై పాకిస్తాన్ సరిహద్దు దగ్గర గస్తీ కూడా కాచాడు. పెట్రోలింగ్ డ్యూటీ కూడా చేశాడు.
2019లో ప్రపంచకప్ సెమీ ఫైనల్స్లో భారత్ ఓటమి అనంతరం ఎంఎస్ ధోనీ చాలా నెలలు జట్టుకు దూరమయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్పెషల్ ఫోర్స్ యూనిట్లో చేరాడు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సుమారు రెండు వారాల పాటు గడిపాడు. బోర్డర్ వద్ద గస్తీ కాచాడు. కఠిన శిక్షణ తీసుకుని సాధారణ జవాన్ చేసే పనులు అన్ని చేశాడు. అప్పుడు దేశమంతటా ధోనీ పేరు మార్మోగిపోయింది. చివరకు ఎన్నో నెలల సస్పెన్స్ తర్వాత 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.
Also Read: World Cup 2023 Qualifiers: స్కాట్లాండ్పై సంచలన విజయం.. వన్డే ప్రపంచకప్కు నెదర్లాండ్స్ అర్హత!
తాజావార్తలు
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!