Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
- నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు
- నేడు 'పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు-2026'పై చర్చ
- విద్యార్థులకు ఇచ్చిన హామీ అమలుపై ప్రభుత్వ దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజులుగా వరుస వాయిదాలతో ప్రతిష్టంభనకు గురైన పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నుంచి సజావుగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చొరవ తీసుకుని అధికార, ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో జరిపిన చర్చలు ఫలించడంతో సభ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. సోమవారం వరుస వాయిదాల అనంతరం స్పీకర్ ఓం బిర్లా వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. సభ సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల సహకారం కోరగా, అందుకు నాయకులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
నేడు ‘పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు-2026’పై చర్చ
లోక్సభలో నేడు ‘పబ్లిక్ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026’పై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లుపై చర్చకు మొత్తం ఆరు గంటల సమయాన్ని కేటాయించారు. అవసరమైతే మరింత సమయం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
విద్యార్థులకు ఇచ్చిన హామీ అమలుపై ప్రభుత్వ దృష్టి
పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అక్రమాలు, కాపీయింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు ఈ బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం, విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు దీనిని ఉభయ సభల్లో ఆమోదింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థుల దీర్ఘకాల డిమాండ్కు అనుగుణంగా ఈ చట్ట సవరణను త్వరగా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆరు రోజులు వృథా.. ఇక మిగిలింది 13 రోజులు
మొత్తం 19 రోజుల పాటు జరగాల్సిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికే ఆరు రోజులు వరుస వాయిదాలతో వృథా అయ్యాయి. ప్రస్తుతం ఆగస్టు 13 వరకు ఇంకా 13 రోజుల సమావేశాలు మిగిలి ఉండటంతో కీలక బిల్లులను ఆమోదించేందుకు ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది.
విద్యార్థులపై దాడి అంశంపై ప్రతిపక్షాల ఆందోళన
విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీశాయి. నినాదాలు, నిరసనలతో సభను హోరెత్తించడంతో గత కొన్ని రోజులుగా సమావేశాలు సజావుగా సాగలేదు.
బిల్లులో కీలక నిబంధనలు
‘పబ్లిక్ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026’లో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలను ప్రతిపాదించారు. పేపర్ లీకేజీలు, కాపీయింగ్, ఇతర మోసాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా బిల్లులో నిబంధనలు చేర్చారు. ఈ బిల్లును త్వరితగతిన ఉభయ సభల్లో ఆమోదింపజేసి దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను పెంపొందించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
-
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
-
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
-
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?