Rohir Sharma: దక్షిణాఫ్రికాతో ఇండోర్లో జరిగిన చివరి టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్గా వెనుతిరిగాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అతడు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ డకౌట్గా వెనుతిరగడం ఇది 43వ సారి. దీంతో ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అత్యధిక సార్లు సున్నా స్కోరుకే అవుటైన ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. గతంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరుతో ఈ రికార్డు ఉండేది. అతడు 42…
Team India: టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో మరో ఆటగాడిని త్వరలో ఎంపిక చేస్తామని తెలిపింది. దీంతో బుమ్రా స్థానంలో ఎవరు ఎంపికవుతారనే చర్చలు మొదలయ్యాయి. సీనియర్ బౌలర్ షమీని తీసుకుంటారా లేదా దక్షిణాఫ్రికాతో సిరీస్లో రాణించిన దీపక్ చాహర్ను ఎంపిక చేస్తారా అంటూ పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునీల్ గవాస్కర్ లాంటి మాజీ…
IND Vs SA: ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. 228 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులో ఎంపికైన శ్రేయస్ అయ్యర్ కూడా ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. అయితే బర్త్ డే బాయ్ రిషబ్ పంత్ 27…
IND Vs SA: ఇండోర్లో టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ మరోసారి రాణించాడు. అతడు 43 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. రోసౌ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో…
IND Vs SA: ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఏకంగా మూడు మార్పులు చేసింది. టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది. వీరి స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఉమేష్ యాదవ్లకు చోటు కల్పించింది. అటు యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను కూడా పక్కనబెట్టి అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ను తీసుకుంది.…
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. 2015 నుంచి ఇప్పటివరకు భారత్లో దక్షిణాఫ్రికా నాలుగు సార్లు టీ20 సిరీస్ ఆడింది. తొలి సిరీస్లో టీమిండియా ఓటమి పాలైంది. రెండు, మూడు సిరీస్లు మాత్రం డ్రాగా ముగిశాయి. తొలి సిరీస్కు ధోనీ, రెండో సిరీస్కు కోహ్లీ, మూడో సిరీస్కు పంత్ నాయకత్వం వహించారు. ఇప్పుడు నాలుగో సిరీస్లో మాత్రం టీమిండియా…
Suryakumar Yadav: టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న అతడు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతడు టీ20 ప్రపంచకప్ వరకు ఇలాగే ఫామ్ కొనసాగించాలని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆకాంక్షించాడు. తాజాగా అతడు ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు మ్యాక్స్వెల్ నెలకొల్పిన ఓ అరుదైన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ అంతర్జాతీయ…
Rohit Sharma: టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. టీ20 ప్రపంచకప్ ముంగిట రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ హుడా గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తుండగా ముక్కు నుంచి రక్తం కారడం టీమ్ మేనేజ్మెంట్తో పాటు అభిమానుల్లో ఆందోళన కలిగించింది. రోహిత్ దగ్గరకు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వచ్చి కర్చీఫ్ అందించి ఏమైందో అడిగి తెలుసుకున్నాడు.…
IND Vs SA: గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారీ స్కోరు చేయడంతో టీమిండియా బతికిపోయింది. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్ విజయపు అంచుల వరకు తీసుకువెళ్లాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 16 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే…
IND Vs SA: ప్రస్తుతం టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్లో పాల్గొనే భారత జట్టును ఆదివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ నుంచి ప్రధాన ఆటగాళ్లను తప్పించారు. ఈ మేరకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ను కెప్టెన్గా నియమించారు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్-ఎతో…