EX MLA Rachamallu: మాపై రాళ్ళతో దాడి చేసి తిరిగి కేసులు పెట్టారు..
- టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు..
- ఉప సర్పంచ్ పదవి కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారు..
- మాపై దాడి చేసి తిరిగి కేసులు పెడుతున్నారు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EX MLA Rachamallu: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 14 మంది ఉంటే తెలుగు దేశం పార్టీకి కేవలం 6 మంది వార్డు సభ్యులతో ఉపసర్పంచ్ పదవీ కోసం పోటీ పడ్డారు.. ఉప సర్పంచ్ పదవి కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేశారని పేర్కొన్నారు. అలాగే, వైసీపీ వార్డు సభ్యులపై సైకిల్ పార్టీ నేతలు దాడి చేశారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: CPI Ramakrishna: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో జగన్ను మించిపోయారు..
Also Read
ఇక, ఎన్నికలు జరిగే కార్యాలయంలో పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు అధికారులపై దౌర్జన్యం చేసిన కేసులు లేవు అని వైసీపీ నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పోలీసులను గట్టిగా ప్రశ్నిస్తున్నా.. చట్ట ప్రకారం మాపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే ఇంత వరకు కేసు నమోదు చేయలేదు అని ఆరోపించారు. మాపై రాళ్ళ దాడి చేయడమే కాక తిరిగి మాపై కేసులు నమోదు చేశారు.. పోలీసుల సహకారంతోనే మాపై దాడులు చేశారన్నారు. జిల్లా ఎస్పీని కలిసి మాకు న్యాయం చేయమని కొరతాం.. మాకు న్యాయం జరగక పోతే కోర్టునూ ఆశ్రయిస్తామని రాచమల్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!