EX MLA Rachamallu: మాపై రాళ్ళతో దాడి చేసి తిరిగి కేసులు పెట్టారు..
- టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు..
- ఉప సర్పంచ్ పదవి కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారు..
- మాపై దాడి చేసి తిరిగి కేసులు పెడుతున్నారు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EX MLA Rachamallu: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 14 మంది ఉంటే తెలుగు దేశం పార్టీకి కేవలం 6 మంది వార్డు సభ్యులతో ఉపసర్పంచ్ పదవీ కోసం పోటీ పడ్డారు.. ఉప సర్పంచ్ పదవి కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేశారని పేర్కొన్నారు. అలాగే, వైసీపీ వార్డు సభ్యులపై సైకిల్ పార్టీ నేతలు దాడి చేశారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: CPI Ramakrishna: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో జగన్ను మించిపోయారు..
Also Read
ఇక, ఎన్నికలు జరిగే కార్యాలయంలో పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు అధికారులపై దౌర్జన్యం చేసిన కేసులు లేవు అని వైసీపీ నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పోలీసులను గట్టిగా ప్రశ్నిస్తున్నా.. చట్ట ప్రకారం మాపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే ఇంత వరకు కేసు నమోదు చేయలేదు అని ఆరోపించారు. మాపై రాళ్ళ దాడి చేయడమే కాక తిరిగి మాపై కేసులు నమోదు చేశారు.. పోలీసుల సహకారంతోనే మాపై దాడులు చేశారన్నారు. జిల్లా ఎస్పీని కలిసి మాకు న్యాయం చేయమని కొరతాం.. మాకు న్యాయం జరగక పోతే కోర్టునూ ఆశ్రయిస్తామని రాచమల్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?