బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఏర్పాట్లు శవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విషయాలు పంచుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘వరంగల్ ఎల్కతుర్తిలో 1200 ఎకరాల్లో చాలా గ్రాండ్ గా సభ ఏర్పాటు చేస్తున్నాం.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్.. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ళ ప్రస్థానం చేసుకుంది టీడీపీ, బీఆర్ఎస్ లే.. అనుమతి కోసం మార్చ్ 25 న పోలీసులకు రిక్వెస్ట్ చేశాము.. తొందరగా అనుమతి ఇవ్వండని నిన్న నేను డీజీపీ తో కూడా మాట్లాడాను.. 3000 బస్సుల కోసం సజ్జనార్ ను అడిగామని తెలిపారు.
Also Read:Will Pucovski: ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సంచలన నిర్ణయం.. కెరీర్ మొదలు కాకముందే!
మా పార్టీ చరిత్రలో ఇది మరో పెద్ద మీటింగ్ అవుతుంది.. రాబోయే సంవత్సరం పాటు ప్రోగ్రాంలు చేస్తున్నాం.. కమిటీలు వేయడం, మెంబెర్ షిప్ లాంటివి వెంటనే మొదలు పెడతాం.. అధ్యక్ష ఎన్నిక పెండింగ్ లో ఉంది.. అందుకోసం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేస్తున్నాం.. జిల్లా పార్టీ కార్యాలయాల్లో 6 నెలల పాటు ప్రోగ్రాంలు చేస్తాం.. జూన్, జులై లో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు అనుకుంటున్నాము.. మేము రెడీగా ఉన్నాం.. కేంద్రం పెట్రోలియం చార్జీలు పెంచిన దానిపై కొట్లాడతాం.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నెగిటివ్ పాలసిలు, నెగటివ్ పాలిటిక్స్ వల్ల చాలా నష్టం జరుగుతుందన్నారు.
Also Read:karthik Aaryan : శ్రీలీల మ్యాటర్కు పుల్ స్టాప్ పెట్టిన బాలీవుడ్ హీరో..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేసుల్లో ఇరికించడం గురించే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు.. లగచర్ల ఘటనలో కూడా రైతుల దగ్గర నుంచే నిరసన మొదలైంది.. hcu విషయంలో కూడా విద్యార్థులే ఉద్యమం చేశారు.. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తున్నామని బట్టి విక్రమార్క చెప్పారు.. అది మేము స్వాగతిస్తున్నాం.. HCU లో AI అంటున్నారు..AI అంటే అనుముల ఇంటెలిజెన్స్ అన్నట్లేనా.. hcu లో జంతువుల మరణాలకు కారణం అయిన వాళ్లపై కేస్ లు పెట్టాల్సిందే.. 100 ఎకరాలు చదును చేయడం వల్ల.. అక్కడ దిక్కు లేక రోడ్ల మీదకు జంతువులు వస్తున్నాయని వెల్లడించారు.
Also Read:Brahma Kumaris Chief: బ్రహ్మకుమారిస్ చీఫ్ దాది రతన్ మోహని కన్నుమూత..
16 నెలలుగా మేము ప్రధాన ప్రతిపక్షంగా మా పని మేము చేస్తున్నాం.. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీలోనే ఉంటుంది.. అందుకు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి రివ్యూలు చేయడం.. కాంగ్రెస్ కు రేవంత్ మీద నమ్మకం లేదు.. అందుకే మీనాక్షిని పంపించారేమో.. ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర నేత చెప్పులు మోస్తే… ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నేత డబ్బులు సంచులు మోస్తున్నాడు” అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.