టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని రెండున్నర ఏళ్లుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని… చంద్రబాబు నాయుడు మనుషులు ఈ రోజు రెచ్చగొట్టే తీరులో మాట్లాడారని మండిపడ్డారు.. నిన్న సీఎం జగన్ పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో లేవన్నారు. ఇక, చంద్రబాబుకి ఇంట్లో సమస్యలు ఎక్కువయ్యాయని కామెంట్ చేవారు అవంతి. ఆ…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బూతులు ఇప్పుడు చిచ్చు పెడుతున్నాయి.. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది.. దీంతో, దాడులు, ఆందోళనలు, నిరసనలు, బంద్లకు వెళ్లిపోయింది పరిస్థితి. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేక బూతులు తిడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.. ఎవరు మాట్లాడని బూతులు ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.. అయితే, దానిని జీర్ణించుకోలేక నన్ను ప్రేమించే వాళ్లు, అభిమానించే వాళ్లు రియాక్షన్ చూపించారని.. దాని ప్రభావం…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల నిప్పులు చెరిగారు. నిన్న వైసీపీ చేసిన అరాచకం నేపథ్యంలో ఏపీ పరిస్థితులపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే నిన్నటి విధ్వంస కాండ చోటు చేసుకుందని… పోలీసులతో కుమ్మక్కై లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కు వైసీపీ పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండారాజ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చారని.. ఇది కాన్సిట్యూషన్ మిషనరీ…
ఏపీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. టీడీపీ కార్యాలయంపై దాడులను ఖండిస్తూ ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా లకు లేఖలు రాశారు. ఈ దాడులపై విచారణ చేపట్టేందుకు సీబీఐ, ఎన్ఐఏలను రంగంలోకి దించాలని కోరారు. అంతేకాకుండా ఇలానే ఉంటే ఏపీ పరిస్థితులు మరింత దిగజారిపోతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పోలీసులపై నమ్మకం పోయిందని, వెంటనే కేంద్ర బలగాలను రాష్ట్రంలో దించాలని…
ఏపీలో రాజకీయం రాజుకుంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిస్తే.. కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్ కోరుకున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని విమర్శించారు.…
టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. రాష్ట్రంలోని పలు కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసగా.. ఓవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వగా… మరోవైపు.. టీడీపీ బంద్ కు నిరసనగా వైసీపీ కౌంటర్గా కార్యక్రమాలను పూనుకుంది… ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ.. టీడీపీ బూతు వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు చేపట్టాలి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు.. టీడీపీ బూతు వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని…
ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. పట్టాభి ఇంట్లో విధ్వంసమే సృష్టించారు.. ఇక, టీడీపీ కేంద్ర కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలపై వైసీపీ శ్రేణులకు దాడులకు పాల్పడ్డాయి.. కొన్ని చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ పరిణామాలపై సీరియస్గా రియాక్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రబంద్కు పిలుపునిచ్చారు.. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు, ప్రజాస్వామ్య హితైభిలాషులు…
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేత పట్టాభి ఇంటితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. రౌడీయిజం చేస్తే బెదురుతామని భావించవద్దు నఅ్నారు.. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా..? అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇది నా కోసం చేసే పోరాటం కాదు.. వైసీపీ సృష్టించిన విధ్వంసానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం.. ఆ బంద్కు సహకరించడం…
డ్రగ్స్, గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా హీట్ పెంచాయి.. వివిధ పత్రికల్లో వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. అందరికీ నోటీసులు ఇవ్వాలంటూ.. నోరు జారిన పట్టాభి.. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న దద్దమ్మకు చెబుతున్నా.. వరే బోసిడీకే నీకు దమ్ముంటే.. గంజాయిపై మాట్లాడిన తెలంగాణ పోలీసులకు, యూపీ పోలీసులకు, మీ అధికారులకు నోటీసులు ఇవ్వాలంటూ సవాల్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ శ్రేణులు.. పట్టాభి ఇంటిపై దాడికి దిగారు..…
టీడీపీ తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మస్త్రాన్ని బయటికి తీసుకొచ్చే సమయం ఆసన్నమైందనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ ఆవిర్భవించి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు టీడీపీ ఎన్నో అటుపోట్లను చూసింది. అధికారంలో ఉండటం ప్రతిపక్షంలోకి వెళ్లడం ఆ పార్టీకి కొత్తమే కాదు. అయినా గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను టీడీపీ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆపార్టీ కనుమరుగు అవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.…