ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి పట్టాభిరామ్ ను విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు, గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న న్యాయమూర్తి మూర్తి పట్టాభిరామ్ కు నవంబర్ 2 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పట్టాభిరామ్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఈ రోజు ఉదయం తరలించారు.…
టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ఇవాళ ముగియనుంది.. గురువారం ఉదయం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో దీక్షకు దిగారు చంద్రబాబు.. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల దాడులను నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు.. ఆ దీక్షకు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ అంటూ పేరు పెట్టారు.. గురువారం ఉదయం నుంచి చంద్రబాబు 36 గంటల దీక్ష…
గత ఎన్నికల్లో ఓడిపోవడంతో.. పత్త లేకుండా పోయారు ఆ మాజీ ఐఏఎస్. ఇప్పుడు సడెన్గా టీడీపీలో పెద్ద పదవితో తళుక్కుమన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీటుకు ఎసరు పెడతారా? అయితే తమ సంగతి ఏంటి? ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు వేస్తున్న ప్రశ్నలివే. ఇంతకీ ఎవరా మాజీ ఐఏఎస్? ఏంటా నియోజకవర్గం? మళ్లీ కోడుమూరు బరిలో దిగుతారా? రామాంజనేయులు. మాజీ ఐఏఎస్ అధికారి. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్. రిటైరైనా సర్వీస్ను పొడిగించడంతో 2019…
వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. కరోనా ఎంట్రీతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ ఏపీలో సంక్షేమ పథకాలు ఏమాత్రం ఆగలేదంటే ఆ క్రెడిట్ మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డులకెక్కింది. ఇలాంటివి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు సంయమనం కోల్పోయి వైసీపీపై బూతులు మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కొద్దిరోజులుగా ఏపీలో…
ఆ జిల్లా టీడీపీలో ఎప్పుడు ఏ గొడవ జరిగినా.. అధిష్ఠానం పేరుతో ఒక లెటర్ వస్తుంది. అందులో ఊరు పేరు.. మ్యాటర్ ఉంటుంది. ఎందుకు పంపిస్తున్నారు.. ఎవరికి పంపిస్తున్నారో వివరాలు కనిపించవు. కానీ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇంతకీ ఆ లేఖల ఆంతర్యం ఏంటి? ఇప్పటికే అనంతలో జేసీ వర్సెస్ టీడీపీ పాత నేతలు..! అనంతపురం జిల్లా టీడీపీలో కొన్నిరోజులుగా వర్గ విబేధాలు ఒక రేంజ్లో సాగుతున్నాయి. గతంలో నియోజకవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉండేది.…
టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన.. మేం కూడా ఢిల్లీకి వెళ్తాం.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం అన్నారు.. ఇక, బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు సజ్జల.. దాడి చేయటం తప్పే.. కానీ, ఆ ఆగ్రహానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు.. మిగిలిన పార్టీలు…
చంద్రబాబుకు మతి భ్రమించిందని మంత్రి గుమ్మనూరు జయరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక చంద్రబాబు మాటల దాడులు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు శవరాజకీయాలు, కుల, మత రాజకీయాలు చేస్తున్నారని ఆయన వయస్సుకు ఇవి తగవని మంత్రి జయరాం అన్నారు.జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఇది సమంజసం కాదన్నారు.నారాలోకేష్కు జయంతి, వర్థంతికి తేడా తెలియదని, మంగళగిరిలో నారాలోకేషును కొట్టాలని మంత్రి జయరాం తీవ్ర స్థాయిలో మాటల తుటాలు పేల్చారు.
టీడీపీ నేతలు సవాల్ చేస్తుంటే.. వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఏపీ వేదికగా టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరి ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. వీరి ఛాలెంజ్ లతో ఏపీ రణరంగంగా మారింది. వైపీసీ నేతలేమో పట్టాభితో పాటు చంద్రబాబును కూడా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూంటే.. టీడీపీ నేతలేమో గుడిలాంటి మా కార్యాలయంపై దాడికి దిగడం సిగ్గుచేటని, దమ్ముంటే ఇప్పుడు రావాలంటూ సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత…
ఎవ్వరూ లేనప్పుడు పోలీసుల అండతో దాడులు చేయించడం కాదు.. దమ్ముంటే చంద్రబాబు దీక్ష ముగిసేలోపు రావాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలనా అస్తవ్యస్థంగా మారిందన్న ఆయన.. 13 జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ను, మాదక ద్రవ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకున్నారని.. ఇదే విషయాన్ని టీడీపీ బయటపెట్టిందన్నారు. ఇక, జె-బ్రాండ్లు కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు బోండా ఉమ..…
ఏపీలో రాజకీయ నాయకులు నువ్వేంత అంటే నువ్వేంత అన్నట్టు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు తారాస్థాయి చేరకున్నాయి. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష ప్రారంభించారు. మరో వైపు పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నాయకులు జనాగ్రహా దీక్షకు దిగారు. అంతేకాకుండా టీడీపీ, వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు దిగారు. ఎప్పడూ వివాదాలతో నిద్రలేచే ఆర్జీవీ ఏపీ రాజకీయాలపై ట్విట్టర్…