అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం.. వైసీపీకి అచ్చెన్నాయుడు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజులుగా ఏపీ మొత్తం టీడీపీ, వైసీపీ ల నిరసనలతో అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యాలయం అంటే దేవాలయం వంటిదని, ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. నేతల భాష విషయంలో జగన్ చర్చకు సిద్దమా..? అని సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ఎవరేం మాట్లాడారో ప్రజలకు తెలుసునన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారని, రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందనే ఆవేదనతో తెలుగుదేశం పోరాడుతుంటే దాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు మా నివాళులు అర్పిస్తామన్నారు. ప్రాణ త్యాగం చేసిన పోలీసుల ఆత్మలు ఈ డీజీపీ తీరుతో ఘోషిస్తాయని, రెండున్నరేళ్లలో డీజీపీ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి కుట్ర పన్ని తొలుత చంద్రబాబు నివాసం పైకి దాడికి యత్నించారని, తర్వాత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ రీతిలో జరగలేదని, సమాజ చైతన్యం కోసమే ఈ 36 గంటల దీక్ష అన్నారు.
Also Read
టీడీపీని భూస్థాపితం చేయడం జగన్ నాయన వల్లే కాలేదని, తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలమని, అధికారంలోకి రాగానే ఏ మూల దాక్కున్నా లాగి లాగి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు భయపడేది లేదని, సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమవటంతో వైసీపీ కౌంటర్ దీక్షలకు దిగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో లభ్యమయ్యే నాసిరకం మద్యంలో మాదక ద్రవ్యాలు కలుపుతుని ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి గంజాయి కొత్త కాదని డీజీపీ మాట్లాడటం దుర్మార్గమని, ఏపీని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేంత వరకు పోరాడతామన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!