Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Ys Jagan Participating In Police Commemoration Day At Vijayawada

రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..

Published Date :October 21, 2021 , 9:12 am
By Sudhakar Ravula
రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

గంజాయి పేరుతో రాష్ట్ర పరువును బజారున వేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్‌ జగన్‌.. విజయవాడలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలతో కూడిన అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, సీఎస్ సమీర్ శర్మ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు.. రాష్ట్రంపై దాడి చేస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.. మన పిల్లలను డ్రగ్స్ బానిసలుగా ప్రపంచం ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించిన సీఎం.. పథకం ప్రకారం కుట్రలు పన్నుతున్నారు. కళంకితలుగా ముద్ర వేసి పిల్లలు, ప్రజల భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం దక్కలేదనే..!
ఇక, శాంతి భద్రతల పరిరక్షణ ప్రథమ ప్రాధాన్యతగా స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్.. ఈ విషయంలో పోలీసులు ఏ మాత్రం రాజీపడొద్దని సూచించిన ఆయన.. కులపరమైన దాడులు, సంఘ విద్రోహ శక్తులను ఉపేక్షించేదిలేదన్నారు.. పెద్దా, చిన్నా, తరతమ బేధాలు లేకుండా చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించారు.. కొన్ని విషయాలను ప్రజల ముందు పెట్టాలి అంటూ.. నేర స్వభావాలు మారుతున్న ఈ కాలంలో వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు సీఎం వైఎస్ జగన్‌.. ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఈ రాష్ట్రంలో నేరం కొత్త రూపాల్లో దాడి చేస్తోందన్న ఆయన.. ఇటువంటి ఓ కొత్త రూపాన్ని గత రెండేళ్లుగా రాష్ట్రంలో చూస్తున్నాం అన్నారు.. అధికారం దక్కలేదని చీకట్లో గుళ్లపై దాడులు చేస్తున్నారు.. అధికారం దక్కలేదని కులాలు, మతాల మధ్య చిచ్చు రేపటానికి వెనుకడుగు వేయడం లేదు.. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను కూడా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..

సీఎంను తిట్టడం కరెక్టేనా..?
మా వాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బూతులు తిడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వైఎస్‌ జగన్.. ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి తల్లిని ఇలా బూతులు తిట్టడం కరక్టేనా? అని ప్రశ్నించిన ఆయన.. అసాంఘిక శక్తులు రాజకీయ నాయకులుగా రూపం మార్చుకున్నరాయని ఆరోపించారు.

పోలీసు వ్యవస్థలో ఎన్నో మార్పులు..
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు సీఎం వైఎస్‌ జగన్.. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ప్రకటించామని గుర్తుచేసిన ఆయన.. 2017 నుంచి బకాయిలు ఉన్న 15 కోట్లు విడుదల చేశామని.. భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాం అని వెల్లడించారు. ఇక, హోమ్ గార్డుల గౌరవ వేతనం పెంచాం.. 16వేల మంది మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నాం, కోవిడ్ బారిన పడి మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇచ్చామన్న ఏపీ సీఎం.. పోలీసులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు ఆదేశించామని.. ఇది కూడా నవంబరు 30 లోపు చేపట్టాలని గడువు కూడా విధించామని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Police Commemoration Day
  • tdp
  • vijayawada

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions