చంద్రబాబు టీడీపీ కేడర్ను మోసం చేస్తున్నారు : వల్లభనేని వంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ, టీడీపీ నానా యాగీ చేస్తున్నాయి. రూ. 50 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెరిగేలా చేసింది బీజేపీ అని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తన హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనే విషయాన్ని అల్జీమర్స్ సోకిన చంద్రబాబు మరిచారు. ధర్నాలు పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వాస్తవాలు దాచి ధర్నాలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. చంద్రబాబుకు కేంద్రం పేరెత్తాలంటే వెన్నులో వణుకు. గడచిన ఎన్నికల్లో మోడీని తిట్టిన తిట్టకుండా తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన పేరెత్తే సాహసం చేయడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయాక తన ఎంపీలను బీజేపీకి పంపారు చంద్రబాబు.
ఇక తమది జాతీయ పార్టీలు.. అంతర్జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. తెలంగాణలో ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గించాలని ధర్నాలు చేయడం లేదు. తడవకొకరును తెర మీదకు తెచ్చి ఏదో డ్రామాలాడుతున్నారు. ఓసారి నిమ్మగడ్డను తెస్తారు.. మరోసారి ఇంకో గడ్డను తెస్తారు. ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు అబద్దాలు చెబుతూ చంద్రబాబు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జగన్ ప్రభుత్వం కేవలం రూపాయి మాత్రమే రోడ్ సెస్ పేరుతో వసూలు చేస్తోంది. చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అల్జీమర్సే కాదు.. పిచ్చిపట్టిందనే నిర్ణయానికి ప్రజలు వస్తారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా చంద్రబాబు టెంట్ మూసేస్తారు.. షెడ్ తీసేస్తారు. చంద్రబాబు చెప్పాడని పెట్రోల్ బంకుల ముందు హరన్ కొట్టడం ఏంటీ. కరెంట్ ఛార్జీలు పెరిగాయని కరెంట్ తీగలు.. ట్రాన్సఫార్మర్లు పట్టుకోమంటే పట్టుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ప్రజల నుంచి వసూల్ చేసిన సెస్ను పోలవరంలో పులిహోరకు ఖర్చు పెట్టారు. చంద్రబాబు తెలుగుదేశం కేడర్ను మోసం చేస్తున్నారు అని పేర్కొన్నారు.
Also Read
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?