ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మొదటి సభలోకి చంద్రబాబు రాకపోవడంతో కుప్పం ఫలితాల కారణంగా రాలేదని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబును సభలోకి ఆహ్వానించారు. అయితే వైసీపీ మంత్రి కొడాలి నాని సభలో మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై చర్చించడానికి టీడీపీ ధైర్యం లేదని.. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అంతేకాకుండా ఇక్కడ రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నామని వేరే…
ఇవాళ రెండో రోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ముందుగా ఒక్క రోజే శాసన సభా సమావేశాలు నిర్వహించాలనుకున్నా… టీడీపీ డిమాండ్కు ఓకే చెప్పి ఈ నెల 26 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. మరోవైపు మొదటి రోజు సమావేశాల్లో కుప్పం రిజల్ట్ హాట్ టాపిక్ అయ్యింది.అసెంబ్లీలో తొలిరోజు మహిళా సాధికారత అంశంపై స్వల్ప కాలిక చర్చను చేపట్టారు. పలువురు మహిళా సభ్యులు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా కుప్పం కోర్ టాపిక్గా మారింది.…
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో చంద్రబాబు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై వ్యూహాం పై చర్చించారు. ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తు న్న పనులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. టీడీపీ ప్రతిపాదించిన 27 అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టాలని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీనిపై ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీయాలని…
ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయాన్ని పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నెల 26 వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను జరుపాలని టీడీపీ డిమాండ్ చేసింది.. కేవలం వారం రోజుల పాటు పొడగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే.. కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ.. అసెంబ్లీ…
ఆంధ్రప్రదేశ్లో బుధవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది… ఇక, మంగళవారం పోలింగ్ జరిగిన 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్లను ఇవాళ లెక్కించనున్నారు.. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెల్లడించింది.. ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఉదయం 10 గంటల కల్లా తేలిపోనుండగా.. జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.. అయితే, నిన్నటి…
బాబాయ్ ఒక పార్టీలో ముఖ్య నేత. అబ్బాయి మరొక పార్టీలో యువనేత. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న ఆ కుటుంబంలో రాజకీయ క్రీడ మొదలైందా? ఇంతకు ఎవరా అబ్బాయ్.. ఎవరా బాబాయ్? లెట్స్ వాచ్..! భూపేష్రెడ్డే రాజకీయ వారసుడిగా అప్పట్లో ఆదినారాయణరెడ్డి ప్రకటన..! దేవగుడి కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుకునేలా కనిపిస్తోంది. ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా ఒక్కటిగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోనుందా? ఏ రాజకీయం అయితే వారిని కలిపిందో.. అదే రాజకీయం…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పును కళ్లారా చూశామని, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని ఆయన మర్యాద పూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శి మినహాయించి అన్ని చోట్లా గెలిచామన్నారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలకు సంకేతాలుగా భావించాలన్నారు. గత ఎన్నికల్లో కొడుకు మంగళగిరిలో ఓడిపోతే.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలయ్యారన్నారు. ఈ ఫలితాలను చంద్రబాబు అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి…
ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం బాగా పెరిగిందని, వైసీపీ పతనానికి ముహుర్తం కూడా ఫిక్స్ అయిందని టీడీపీ నేత అశోక్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీ పై విరుచుకు పడ్డాడు. వైసీపీకి సమాధి కట్టడానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. టీడీ పీకి ప్రజాదరణ పెరిగిందని ఆయన అన్నారు. ఈ విజయం సీఎం జగ న్ది కాదు.. డీజీపీదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు వెళ్లి సీఎంని కల వడం కాదు..…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పూర్తిగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోలహలం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్ల ఫలితాల్లో వైసీపీ పార్టీ దుమ్ము దులుపుతోంది. దర్శి మినహా దాదాపు అన్ని మున్సిపాలటీలు వైసీపీ కైవసం అయినట్లు సమాచారం అందుతోంది. అయితే..ఈ ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతుంటే… ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. బుగ్గన రాజేంద్ర నాథ్ నివాసం ఉండే 15 వ వార్డులో వైసీపీ పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ తరఫున…