రాజకీయ క్రీడకు చంద్రబాబు తెరతీశారు : పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారు. ఇది దురదృష్టకరం అని మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెరమీదకు తెచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు? ఏమన్నారో చెప్పాలి. చంద్రబాబు మాటలను వీడియో తీశారు కదా? అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా అని అడిగారు. అనని మాటని, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరం. రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి కారణం చంద్రబాబే. తెలుగు రాజకీయాలు చూసేవారికి మరోసారి చెప్తున్నాం. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదు. అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ చర్చపై వీడియో అందరి దగ్గరా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పారు.
వైసీపిని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు కూడా నిజమేనని నమ్మారు. వారి బుర్రలో విషం ఎక్కించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏదేదో జరిగినట్టు నమ్మించే నేర్పరితనం చంద్రబాబు సొంతం. దుర్మార్గమైన రాజకీయ క్రీడకు చంద్రబాబు తెరతీశారు. చంద్రబాబు అనుభవానికి ఒక పరమార్ధం ఉండాలి. కానీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడతారని ఊహించలేదు. ప్రశాంతమైన వాతావరణంలో వ్యవసాయ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈలోపు జగన్, ఆయన కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఇలాంటి పనుల వల్ల రాష్ట్ర రాజకీయాలను ఎలాంటి పరిస్థితులకు తీసుకుని వెళ్తున్నారు. వైసీపి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల విజయంపై వైసీపి కొవ్వొత్తుల ర్యాలీ చేస్తోంది. కేంద్రం పై పోరాడి విజయం సాధించినందుకు మేము ఇది చేస్తున్నాం. రైతుల దీక్షకు మా ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. బందులకు కూడా సహకరించింది. మరి చంద్రబాబు ఏ కారణంతో కొవ్వొత్తుల నిరసన చేపట్టారు అన్నారు. మరోసారి చెప్తున్నాం.. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను నమ్మవద్దు.
Also Read
రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో విషాన్ని ఎక్కిస్తున్నారు. ఇంతకంటే వికృత రాజకీయాలు దేశంలో ఎక్కడా లేవు. బాలకృష్ణ అమాయక చక్రవర్తి. కానీ చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని అయన అనుకుంటున్నారు. అందరి ఇళ్లల్లో ఆడవారు ఉన్నారు. అలాంటిది మేము ఎందుకు తిడతాము… అసలు అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై ఒక్క ప్రశ్న ఐనా వేశారా… అనవసర మాటలతో రాద్దాంతం చేసింది చంద్రబాబు. వివేకా హత్య జరిగినప్పుడు ప్రభుత్వం నడుపుతున్నది ఎవరు… ముద్దాయిలను అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు… అసెంబ్లీలో మైకు కట్ చేసినా క్షణాల్లో సెల్ ఫోన్ లో ఎలా వీడియో తీశారు… ఇదంతా ప్రీప్లాన్ గా చేసిన వ్యవహారం. చంద్రబాబు చేతిలో ఇంకా మోసపోవద్దని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కోరుతున్నాం. ఏపీ రాజకీయాల్లో నిన్నటిరోజు నిజంగానే బ్లాక్ డే అని పేర్కొన్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!