ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతోంది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన కొద్దిసేపటికే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు.. అంతకుముందు బీజేపీతో పొత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్.. జనసేన లాంటి పార్టీ బీజేపీని రోడ్ మ్యాప్ అడగమేంటని విమర్శలు వచ్చాయని గుర్తుచేసుకున్న పవన్.. ఎందుకో బీజేపీతో పొత్తు ఉన్నా.. పూర్తిస్థాయిలో కలిసి వెళ్లలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.. ఈ…
Minister Ambati Rambabu: మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నాడు.. ఆయన ఏదో సాధిస్తాడని నమ్మే వాళ్లకు చెబుతున్నాను.. పవన్ను చూస్తే జాలేస్తోంది.. వీర మహిళలు, జన సైనికులు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో మీకు స్పష్టత ఉందా..? అంటూ ప్రశ్నించారు.. మీ నాయకుడు ఎవరితో పొత్తులో ఉన్నాడు? బీజేపీతో పొత్తులో…
చంద్రబాబు ఆలోచనలు వేరేగా ఉంటాయి.. ఆయనకు ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల కోసం చౌకబారు ఎత్తుగడలు వేయదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
మునుగోడు ఉప ఎన్నికలో TDP పోటీ చేయడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, త్వరలో వెల్లడిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
TDP Flag: ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం.. కల్తీ ఆహారం.. మారిన తిండి అలవాట్లతో.. మనిషి జీవన ప్రమాణ స్థాయి క్షీణించింది. అరవై ఏళ్లు బతికామంటేనే గొప్ప అనుకునే రోజులొచ్చాయంటే నమ్మశక్యం కాదు. కానీ ఓ వృద్ధుడు 80 ఏళ్ల వయసులోనూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అక్కడ టీడీపీ జెండా ఎగరవేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గింజుపల్లి శివప్రసాద్ అనే వృద్ధుడు ఎవరెస్ట్ శిఖరాన్ని 5000 మీటర్ల ఎత్తు…
విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసిన ఆయన.. ఆ లేఖను జేఏసీ ప్రతినిధులకు అందజేశారు.
విపక్షాలు ఎన్ని పగటి వేషాలు వేసినా.. సీఎం కుర్చీని దక్కించుకోలేరు అంటూ వ్యాఖ్యానించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి… నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్ళ దిబ్బ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. విపక్షాల తీరుపై ధ్వజమెత్ఆరు.. విపక్షాలు ఎన్ని పగటి వేషాలు వేసినా.. సీఎం కుర్చి దక్కించుకోలేరని స్పష్టం చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు హైదరాబాదులో ఉంటూ.. విజయవాడకి అల్లుళ్ల లాగా…
అమరావతి రైతుల పాదయాత్రపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు… ఇది రైతుల పాదయాత్ర కాదు.. ఒళ్లు బలిసినవాళ్లు చేస్తున్న పాదయాత్ర అని చెప్పాను.. ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నా… కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అది అంటూ మండిపడ్డారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కడుపు మండిన వారు పాదయాత్ర చేస్తే చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబు మూల్యం చెల్లించకోక తప్పదు.. యాక్షన్ కు రియాక్షన్…