Buggana Rajendranath Reddy: అవాస్తవాలు మాట్లాడొద్దు.. ఆ ప్రభుత్వ బకాయిలను కూడా మేమే తీర్చాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. యనమలకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియట్లేదన్న ఆయన.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజానిజాలు తెలియకే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. యనమల ప్రకటనలో ఏ ఒక్కటీ వాస్తవం ఉండదు అని ఫైర్ అయ్యారు.. ఏది అనుకూలంగా ఉంటే.. యనమల దానినే తీసుకుంటారు.. గతంలో ఎంతో ధనాన్ని మూటగట్టి.. ఈ ప్రభుత్వానికి ఇచ్చినట్టు యనమల మాట్లాడుతున్నారు.. కానీ, అన్ని శాఖల్లోనూ పెండింగ్ బిల్లులే ఉన్నాయి… సున్నా వడ్డీ, పావలా వడ్డీలో పెండింగ్ ఆ ప్రభుత్వమే పెట్టింది.. ఆ ప్రభుత్వ బకాయిలను కూడా ఈ ప్రభుత్వమే తీర్చిందని వెల్లడించారు.
Read Also: 88th marriage: 14 ఏళ్లకే మొదలుపెట్టేశాడట.. 61వ ఏట 88వ పెళ్లి..!
Also Read
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
ప్రస్తుతం ధాన్యం బిల్లుల చెల్లింపులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని తెలిపారు మంత్రి బుగ్గన.. ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాం.. కానీ, అవాస్తవాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.. ఇక, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎంత వినియోగం అవుతుందో కచ్చితమైన లెక్క తెలియడం లేదని.. విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తోన్నా.. యనమలకు అర్థం కావడం లేదని విమర్శించారు.. అప్పుడప్పుడు ఓ పీహెచ్సీకో.. ఓ స్కూల్కో యనమల వెళ్తే వాస్తవాలు తెలుస్తాయని సూచించిన ఆయన.. విజయవాడలో కూర్చొని యనమల అవాస్తవాలు మాట్లాడ్డం సరికాదని హితవుపలికారు..
అంతేకాదు.. అప్పుడప్పుడు తుని వెళ్లాలని యనమలకు సూచించారు మంత్రి బుగ్గన.. యనమల తుని వెళ్లాలంటే ఎయిర్ పోర్టు వేయాలేమో..? అని సెటైర్లు వేశారు.. వైసీపీ ప్రభుత్వంలోనే పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పర్సెంటేజ్ పెరిగిందనన్నారు.. ఇక, టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం అవుతోందని విమర్శించారు.. పసుపు కుంకమ డబ్బులను క్యూలో నించోబెట్టి చెక్కులిచ్చారని.. అలాగే మహిళలు కూడా క్యూలో నిల్చొని నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారన్న ఆయన.. కొన్ని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రోడ్లు వేయని మాట వాస్తవమే అన్నారు.. గ్రామ, వార్డు సచివాలయాల భవనాల కోసం పీఆర్ రోడ్లు తక్కువగానే వేశాం… వైఎస్సార్ ఆహ్వానం మేరకు నాడే కియా సంస్థని స్థాపించాలని భావించామని కియా ఎండీ లేఖ రాశారని తెలిపారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి.
అయితే, బుగ్గన వ్యాఖ్యలపై మండిపడ్డారు యనమల.. బుగ్గన మాటలు చీకట్లో అద్దం చూపించే మాదిరి ఉన్నాయని.. అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చాలని బుగ్గన ప్రయత్నిస్తున్నారు.. విద్యుత్ మీటర్ల పేరుతో రూ. 3,500 కోట్ల కుంభకోణానికి పాల్పడుతూ విద్యుత్ వినియోగం తెలసుకునేందుకు మీటర్లు పెడుతున్నామనడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యారు.. విద్యుత్ వినియోగం తెలుసుకోవాలంటే మార్కెట్లో దొరికే రూ.300ల సాధారణ విద్యుత్ మీటర్ సరిపోతుంది. ఒక్కో మీటర్ రూ.35 వేలు పెట్టి కొని కుంభకోణానికి పాల్పడాల్సిన అవసరం లేదు.. ఈ ఆర్ధిక సంవత్సరం ఏడు నెలల్లో రూ. 53,500 కోట్లు అప్పు చేసింది చాలక మారిటైమ్ బోర్డు ద్వారా మరో రూ.5 వేల కోట్లు అప్పు చేసేందుకు రంగం సిద్ధం చేశారని.. ఏడాదికి దాదాపు రూ.1,20,000 కోట్లు అప్పు చేసి టీడీపీ కంటే తక్కువ అప్పు చేసామని చెప్పడం బుగ్గన దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!