Ayyannapatrudu: ఎన్ని కేసులు పెట్టినా..నన్నేం పీకలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు. భవిషత్తులో చేయను. నేను బ్రతికి ఉన్నంత కాలం ఏ తప్పూ చేయను. బెయిల్ పై నర్సీపట్నం తన స్వగృహానికి వచ్చిన అనంతరం తన రాక కోసం అభిమానంతో ఎదురుచూస్తున్న నాయకులు కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు అయ్యన్నపాత్రుడు. నాయకులు, కార్యకర్తల రుణం తీర్చుకుంటాను..నా కుటుంబానికి అండదండగా ఉన్న అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు అన్నారు అయ్యన్న.
Read ALso: Kaleshwaram Gravity Canal: విషాదం.. కెనాల్ లో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృతి
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
అయ్యన్న పాత్రుణ్ణి ఏం పీకలేరు కాబట్టి.. కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. నీవు దోచుకుంటున్నావు… దాచుకుంటున్నావు.. దాన్ని అవసరమైతే లేదని ఆరోపణలు నిరూపించుకో అంటూ పరోక్షంగా సీఎంకు సవాల్ విసిరారు. రోడ్లు మీద గుంతలు పూడ్చలేకపోతున్నావు..ఇసుక అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నావు..పరిపాలన చేతకాక, దాన్ని మభ్య పెట్టేందుకు మా మీద కేసులు పెట్టి ఇంకా ఎన్నాళ్లు ఇలా కాలం గడుపుతారు..నా మీద 14 కేసులు పెట్టి నన్ను ఏం పీకావు..రేపు 2024లో నిన్ను రాష్ట్రంలో ప్రజలు తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందన్నారు.
అధికార పక్షం తప్పుచేస్తే.. దాన్ని విమర్శించడం ప్రతిపక్షంగా మా ధర్మం..నీవు వీలైతే చేసిన తప్పుల్ని సరిచేసుకో.ఎన్ని కేసులు పెట్టినా .. నా మాట ఒక్కటే..నీకు దమ్ముంటే, మగతనం ఉంటే నామీద చూపించు..అయ్యన్నపాత్రుణ్ణి కొట్టి, లైవ్ లో చూద్దామని అనుకున్నావు. నా వల్ల ఇంతమంది నా కుటుంబ సభ్యులు నాయకులు ఎందుకు ఇబ్బంది పడవలసి వస్తోంది అన్న విషయంపైనే నేను బాధ పడాల్సి వస్తోందన్నారు అయ్యన్నపాత్రుడు.ఇదిలా వుంటే.. అమరావతి హైకోర్టులో అయ్యన్నపాత్రుడు లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ ఇవాళ జరగనుంది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టెయ్యాలంటూ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అయ్యన్నపాత్రుడు. ఆయనకు రిమాండ్ విధించేందుకు జడ్జి నిరాకరించిన సంగతి తెలిసిందే.
Read Also: Rajendranagar ATM: బ్యాంక్ సిబ్బందినే బురిటీ కొట్టించిన డ్రైవర్.. రూ.36 లక్షలతో పరార్
తాజావార్తలు
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..