రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని ఎం.కన్వెన్షన్లో మంగళవారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని అమరావతిలో కట్టడాలను పలువురు నేతలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు.
ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా మంది వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి.
కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి సపోర్టుగా షాకింగ్ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈసారి రాబోయే ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి ఓటమికి తప్పదన్న ఆ సర్వే రిపోర్ట్ లో వెల్లడైందని పుత్తా ఫ్యామిలీ తెలిపింది.