Pemmasani: టీడీపీ అధికారంలోకి రాగానే అందరిని ఆదుకుంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెనాలిలోని స్థానిక ఆటోనగర్ అసోసియేషన్ హాల్లో గురువారం నాడు జరిగిన సమావేశానికి నాదెండ్ల మనోహర్ తో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చిన వాళ్లం విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు. రోడ్లు, నీళ్లు వంటి కనీస సౌకర్యాలకు బదులు ఓట్లు కొనుక్కోవాలనే దుష్ట ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. లారీ డ్రైవర్ల నుంచి పన్నుల రూపేణా గతం కంటే 200% ఎక్కువగా ఈ ప్రభుత్వం సామాన్యుల నుంచి వసూలు చేస్తుందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మైక్రో రుణాలు, అసోసియేషన్ సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
Read Also: Vijay Sethupathi : విజయ్ సేతుపతి చేసిన పనికి శభాష్ అంటున్న ఫ్యాన్స్..
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
అలాగే, తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఈ ఆటోనగర్ ద్వారా 4 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఆటోనగర్లో కష్టపడే వారికి సహకరిస్తున్న సభ్యులకు అభినందనలు తెలిపారు. తాను ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో సోలార్ ప్లాంట్, పెదరావూరు – నందివెలుగు నాలుగు లైన్ల రహదారి తదితర ప్రతిపాదనలు, కేటాయింపులు చేశానని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఉన్నతమైన ఆలోచనలతో తాను, పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తమ ఇరువురికి ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను నాదెండ్ల కోరారు.
Read Also: Yarlagadda VenkatRao: గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు విస్తృత పర్యటన..
అలాగే, గురువారం నాడు కొల్లిపర మండలంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ పర్యటనలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కొల్లిపర శివారు ప్రాంతం నుంచి ప్రారంభమైన ప్రచార యాత్ర అంగరంగ వైభవంగా ముందుకు సాగింది. వీధి వీధినా కొనసాగిన ప్రచార రథానికి స్థానికులు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులు పట్టి నాయకులకు స్వాగతం పలుకగా, అభిమానులు, కార్యకర్తలు పలు కూడళ్ల వద్ద గజమాలలు వేసి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే డ్రిప్ ఇరిగేషన్ ఈ ప్రాంతంలోను అందుబాటులో ఉంది.. అయితే డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఈ ప్రభుత్వం అందించలేకపోవడంతో ఆ పథకం కూడా మూలన పడింది అని పెమ్మసాన్ని చంద్రశేఖర్ విమర్శించారు. ఇసుక మాఫియా జరుగుతుందని ఫిర్యాదులు చేస్తే అలాంటివి ఏమీ జరగడంలేదని మాయమాటలు చెప్పి ఈ నాయకులు తప్పించుకున్నారు. ఇసుక మాఫియా తవ్విన గోతుల వల్ల కొల్లిపర పరిసర ప్రాంతాల్లోని 38 మంది గడిచిన ఐదేళ్లలో ప్రాణాలు వదిలారు. అటు ప్రకృతి పరంగా ఇటు ప్రాణాల పరంగా భారీ నష్టం జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.
Read Also: Iran Israel tensions: ఎయిరిండియా కీలక ప్రకటన.. సర్వీస్లు నిలిపివేత
మన ప్రాంతంలో ఇసుక, మైనింగ్, గ్రావెల్ అన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాన్ని చంద్రశేఖర్ తెలిపారు. ఈ అవినీతి సొమ్మంతా నాయకులే తింటున్నారా? లేదా పెద్ద తలలకు అందిస్తున్నారా? ప్రజా ధనాన్ని కొందరు అధికారులు, నాయకులు ఇలా దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడానికి ఓ పవన్ కళ్యాణ్, ఒక పెమ్మసాని రాకూడదా? అని ప్రశ్నిస్తున్నాను. రాజధాని కోసం 33 వేల ఎకరాలను అందించగా, అందులో 20వేల ఎకరాలను ఒక ఎకరం మాత్రమే ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు అందించారు. కానీ ఆ భూములన్నీ కేవలం ఒక సామాజిక వర్గమానికి మాత్రమే చెందినవంటూ ఈ ప్రభుత్వం నెపం మోపింది. ఒక వ్యక్తి పై కక్షతో లక్షలాది మంది ప్రజలకు చెందాల్సిన భూములను, ఆస్తులను, భవనాలను నిర్వీర్యం చేసింది అన్నారు. రాష్ట్రానికి రాజధాని అమరావతికి ఇంత ద్రోహం చేసిన నాయకులను ఇంకా నమ్మాలా! వద్దా! అని ప్రజలే నిర్ణయించుకోవాలి అని పెమ్మసాన్ని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..