Gorantla Butchaiah Chowdary: గోదావరి జిల్లాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ.. రాబోయే ఎన్నికల్లో వార్ వన్ సైడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Butchaiah Chowdary: గోదావరి జిల్లాలు రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలు రాబోయే ఎన్నికల్లో వార్ వన్సైడే అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు గోరంట్ల.. తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా పదోసారి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారాయన.. భారీ ర్యాలీగా కలెక్టర్ కు తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు.. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జిల్లాలు రాజకీయ చైతన్యం కలిగినవి.. రాక్షస పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని ధీమా వ్యక్తం చేశారు.. రాబోయే ఎన్నికల్లో వన్ సైడ్ వార్ గా కూటమి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక మేనిఫెస్టోతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడుతాను అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోసారి రాజమండ్రి రూల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Read Also: Iran Israel tensions: ఎయిరిండియా కీలక ప్రకటన.. సర్వీస్లు నిలిపివేత
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ పై క్లారిటీ వచ్చినప్పటి నుంచే ప్రచారంలోకి దిగారు బుచ్చయ్య చౌదరి.. తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. ఈ సారి బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవశ్యకథను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అందరూ సమిష్టిగా కృషిచేసి కూటమిని గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని.. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో అంతా అవినీతి మయమేనని ఆరోపిస్తున్నారు.. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ఏడాదికి రూ 15 వేల చొప్పున, వారి చదువు కోసం అందిస్తారని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వారికి నెలకు రూ.1500 అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3 వేలు అందిస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఆలోచనతో చంద్రబాబు మహాశక్తి పథకాలు ప్రకటించారు అని అన్నారు.నవరత్నాల పేరుతో జగన్ అందర్నీ దగా చేసాడని, మైనార్టీలకు, దళిత, గిరిజనులకు ఎటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు నిర్మాణం చేసి అందరి సొంతింటి కలను నిజం చేయడానికి కృషిచేస్తామని తెలిపారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!