Off The Record: సీఎం జగన్ మీద పడ్డ రాయిని చూసి టీడీపీ భయపడుతోందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ సీఎం జగన్ మీద రాయి దాడి ఘటన. ఇందులో ఎవరి వాదన ఎలా ఉన్నా… పోలీసులు మాత్రం సీఎంకు ప్రాణహాని తలపెట్టేందుకే ఆ రాయి విసిరినట్టు క్లారిటీ ఇచ్చేశారు. రాయి విసిరింది సతీష్ అనే కుర్రాడైతే.. దాని వెనుక ఉంది టీడీపీ బీసీ సెల్ నేత అని దాదాపు ఓ నిర్ధారణకు వచ్చేసినట్టే కన్పిస్తోందంటున్నారు పరిశీలకులు. అంత సెక్యూరిటీ ఏం చేస్తోందని ముందు విమర్శలు వచ్చినా… రెండు రోజుల వ్యవధిలోనే నిందితుణ్ని పట్టేసుకున్నారు ఏపీ పోలీసులు. సీఎం జగన్ను చంపడానికే రాయి విసిరారని రిమాండ్ రిపోర్టులో కూడా రాసేశారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో పెరుగుతోందట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అంటే మామూలు విషయం కాదు. మొన్నటి వరకు నిందితుడి ఎవరో తెలీదు.. ఎవరో రాయి విసిరారు.. అది కూడా సరిగా కన్పించ లేదు… ఇదంతా ట్రాష్.. ఒట్టి డ్రామా అని కొట్టిపారేసిన టీడీపీ నేతల్లో.. ఇప్పుడు నిందితుడు దొరకడంతో టెన్షన్ మొదలైందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
జగన్కు తగిలిన రాయిని గుర్తించడమే కాకుండా.. ఆ కుర్రాడు కూడా టీడీపీ నేత ప్రోద్భలంతోనే విసిరాడన్న నిర్ధారణకు వచ్చి.. రిమాండ్ రిపోర్టులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో ఇప్పుడు టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయట. సీఎం రోడ్ షోకు వస్తే డబ్బులిస్తామని చెప్పి.. ఇవ్వకపోవడం వల్ల రాయి విసిరారనే ప్రచారం జోరుగా సాగింది. అలాగే డబ్బులిచ్చి రోడ్ షోకు తీసుకెళ్లారని.. అసలు డబ్బుల కోసం ఆశపడకుంటే.. తమ మీద.. తమ పిల్లల మీద ఈ నింద పడేది కాదంటూ నిందితుల కుటుంబ సభ్యులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. రాయి విసిరింది సీఎంని చంపడానికేనని పోలీసులు తేల్చేయడంతో మళ్లీ మనకు ముప్పు తప్పదా అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోందట. కోడికత్తి వల్ల గత ఎన్నికల్లో ఎంత డ్యామేజ్ జరిగిందో గుర్తు చేసుకుంటూ.. ఈసారి ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడటం ఎలాగంటూ టీడీపీ లీడర్స్ లెక్కలేసుకుంటున్నట్టు తెలిసింది. ఏ మాత్రం తేడా జరిగినా.. అసలుకే మోసం వస్తుందన్న ఆందోళనలో తెలుగుదేశం ఉన్నట్టు తెలిసింది.
Also Read
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
అసలా రాయి ఎపిసోడ్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న భావన ఓవైపు వ్యక్తం అవుతున్నా.. మరోవైపు కీడెంచి మేలెంచాలన్న సామెతను గుర్తు చేసుకుంటున్నట్టు కూడా మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పటికే రకరకాల తలనొప్పులతో సతమతం అవుతున్న పార్టీకి ఈ రాయి ఎపిసోడ్ మరో నొప్పిగా మారే ప్రమాదం ఉన్నందున ఆ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటున్నాయట టీడీపీ శ్రేణులు. ఈ క్రమంలో కోడికత్తి ఎపిసోడ్ని మరోసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయడంతోపాటు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, నిందితుడు శ్రీను ఐదేళ్ల పాటు జైల్లో ఉన్న వ్యవహారంపై విస్తృత చర్చ పెట్టాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు.. గతంలో టీడీపీని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ ఏయే అంశాలను ప్రస్తావించింది.. ఆ తర్వాత వాటిలో నిజాలు, అబద్దాల సంగతేంటి అంటూ మరోసారి జనం మీదికి ప్రశ్నల్ని సంధించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసింది. వీలైనంత వరకు ఆ రాయి దెబ్బ తమకు తగలకుండా కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట టీడీపీ. ఇదే సందర్భంలో అబద్దం.. వాస్తవం.. అనే పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక పోలీసు ఉన్నతాధికారుల వ్యవహార శైలి, ప్రత్యేకించి బెజవాడ సీపీ కాంతి రాణా తాతా తీరును, ఆయనకు సంబంధించిన లోగుట్టు వ్యవహారాలను తెర మీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందన్నది టీడీపీ ఇంటర్నల్ టాక్.
తాజావార్తలు
-
Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!