MLA Gorantla Butchaiah Chowdary on Villages Development: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదల, స్వచ్ఛమైన త్రాగునీరు సదుపాయాల రూపకల్పనకు ప్రభుత్వ నడుం బిగిస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అడుగులు వేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో నిధులు లేమితో వీధిలైట్లు, పైపులైన్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇక నుంచి ఆ పరిస్థితులు…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి వైసీపీ మాజీ మంత్రికి లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారట. నీ చేష్టలు, చర్యలే ఇవాళ మమ్మల్ని ఒడ్డున పడేశాయి, ఎంత మంచివాడవు అనుకుంటున్నారట. అదేంటీ… టీడీపీ లీడర్స్ వైసీపీకీ నాయకుడికి ధాంక్స్ చెప్పడమేంటి? ఆయన వాళ్ళకు చేసిన అంత మేలేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. లెట్స్ వాచ్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 13 చోట్ల తెలుగుదేశం, రెండు సీట్లలో…
Nimmala Ramanaidu: గత ప్రభుత్వ పాలన పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమను వట్టిసీమగా జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు బంగారు సీమగా మారింది.
రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీపై ఏపీ సీఎం సంకేతాలు ఇచ్చారు. టీడీపీ హయాంలోని ఇసుక పాలసీకి.. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులు వివరించారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబుకు తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం.. సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి చేసింది.
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.
మేము ఓడినా ప్రజలకు కోసం మేము పోరాటం చేస్తామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థను కుడా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
Margani Bharat Ram: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణం అని ఆయన మండిపడ్డారు.