Nimmala ramanaidu: ఉచిత ఇసుక, తల్లికి వందనంపై విష ప్రచారం.. మండిపడ్డ మంత్రి
- తల్లికి వందనం.. ఉచిత ఇసుకపై వైసీపీ విషప్రచారం..
- మండిపడ్డ మంత్రి నిమ్మల రామానాయుడు..
- 30 రోజులుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala ramanaidu: తల్లికి వందనం, ఉచిత ఇసుక పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. తల్లికి వందనం పథకంపై వైసీపీ విషప్రచారం చేస్తుందని.. వీళ్ల అబద్ధాలు, అసత్యాలు 30 రోజులుగా చూస్తూనే ఉన్నామని.. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పామని.. కానీ, ఈరోజు ఒకరికి ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారని.. ఇంకా ఆ పథకాన్ని గ్రౌండ్ లెవెల్ లో అమలు చేయలేదు.. ఎలా అమలు చేయాలి.. ఎంతమందికి ఇవ్వాలనేది కార్యాచరణ రూపొందించకుండానే అప్పుడే వీల్లేదో సెక్రటరీ ఇంట్లో, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ మనసులో ఏముందో తొంగి చూసినట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: PM Modi: ‘‘సంవిధాన్ హత్య దివాస్’’పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఇప్పటికీ మళ్లీ చెప్తున్నా.. తెలుగుదేశం – జనసేన – బీజేప ప్రభుత్వం అంటే మాట ఇస్తే మడమ తిప్పని ప్రభుత్వమని, మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం అన్నారు మంత్రి నిమ్మల.. అందుకు గత 30 రోజుల పరిపాలన ఉదాహరణ అన్నారు. తల్లికి వందనం పథకాన్ని గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అందిస్తామని భరోసా కల్పించారు. గత 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమతిప్పి ఇద్దరికి కాదు ఒకరికే అన్నారు.. ఆ రోజు ఒక సంవత్సరం 15 వేల రూపాయలు తర్వాత సంవత్సరం 14 వేలకు కోత విధించారని.. తర్వాత సంవత్సరం 13 వేలకు కుదించి కోత వేశారని మరల ఒక సంవత్సరం పూర్తిగా అమ్మఒడికే కోత వేశారని.. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు మాత్రమే అమ్మఒడి వేశారని విమర్శించారు.
Read Also: Anant ambani wedding: ముందస్తు పెళ్లి వేడుకల్లో రాధిక లుక్లు ఇవే!
జగన్మోహన్ రెడ్డి మాదిరిగా కోతలు లేకుండా ఐదు సంవత్సరాలు కూడా పిల్లలందరికీ అన్నమాట ప్రకారం తల్లికి వందనం అందిస్తామని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. అలాగే ఉచిత ఇసుక పై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులకు సైతం కౌంటర్ ఇచ్చారు.. మీకు కావాలంటే ఒక ఎడ్ల బండి తోను ఒక బకెట్ తోను వెళ్లి తీసుకును ఉచితంగా తెచ్చుకోవచ్చని.. ఏదైతే ఐదు యూనిట్లు మూడు యూనిట్లు లారీ లేదా ట్రాక్టర్లో తెచ్చుకునే వారికి రవాణా ఖర్చులు మరియు ఎగుమతి చార్జీలు ఉంటాయన్నారు. మీ అంతట మీరు తెచ్చుకునేందుకు ఉచితంగానే అందిస్తామని మంత్రి నిమ్మల అన్నారు. మరోవైపు.. విశాఖ హుక్కు ప్రైవేటీకరణకు ఆరోజున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని అసత్య ప్రచారం చేశారని.. ఏదైతే నిన్న కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగేది లేదని స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఈ రకంగా అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేసే వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి నిమ్మల రామానాయుడు.
తాజావార్తలు
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!